Iran: ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై పేలుడు.. 51 మంది మృతి
- ఆదివారం ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై భారీ పేలుడు
- ఈ ఘటనలో 51 మంది మృతి
- 20 మందికి గాయాలు
- ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్లో ఈ పేలుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారు. అంతేకాకుండా.. 20 మంది గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్లో ఈ పేలుడు సంభవించింది. తూర్పు ఇరాన్లోని తబాస్ గనిలో పేలుడు సంభవించినట్లు అధికారిక IRNA వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 70 మంది ఉద్యోగులు సైట్లో ఉన్నారు.
నివేదిక ప్రకారం.. గనిలోని రెండు బ్లాకులలో పేలుడు సంభవించింది. ఈ గని ప్రైవేట్ ఇరానియన్ సంస్థ మదంజూ యాజమాన్యంలో ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు తబాస్కు అంబులెన్స్లు, హెలికాప్టర్లు సహాయం అందించాయి. అలాగే.. కొంతమంది బాధితుల మృతదేహాలను మైనింగ్ వాహనాలలో ఆస్పత్రికి తీసుకెళ్లాయి. మిగిలిన మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్లు పనిచేస్తున్నాయని సౌత్ ఖొరాసన్ గవర్నర్ జవాద్ ఘెనాట్ స్టేట్ టీవీకి తెలిపారు.
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
Snake In Train: రైలు ఏసీ కోచ్లో పాము.. వైరల్ అవుతున్న వీడియో..
ప్రమాదంపై విచారణకు రాష్ట్రపతి ఆదేశించారు
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే. సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. “దురదృష్టవశాత్తూ తబాస్లోని బొగ్గు గనులలో ప్రమాదం జరిగిందని.. మా ప్రజలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలుసుకున్నాము. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పెజెష్కియాన్ అన్నారు.
ఖొరాసన్లో 3 రోజుల బహిరంగ సంతాపం
బాధితులకు, వారి కుటుంబాలకు అత్యవసర సహాయాన్ని అందించడానికి తన మొదటి వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రెజా అరేఫ్ క్యాబినెట్ సభ్యులతో మాట్లాడినట్లు IRNA తెలిపింది. పేలుడు సంభవించిన తరువాత అధికారులు ప్రావిన్స్లో మూడు రోజుల బహిరంగ సంతాప దినాలు ప్రకటించారు. అలాగే.. ఇరాన్ రెడ్ క్రెసెంట్ గని వద్ద శోధన, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని.. ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకున్నారని చెప్పారు. IRNA ప్రకారం, ఈ ఉద్యోగులు భూమి ఉపరితలం నుండి 250 మీటర్ల దిగువన ఉన్నారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..