Iran: ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై పేలుడు.. 51 మంది మృతి
- ఆదివారం ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై భారీ పేలుడు
- ఈ ఘటనలో 51 మంది మృతి
- 20 మందికి గాయాలు
- ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్లో ఈ పేలుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారు. అంతేకాకుండా.. 20 మంది గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్లో ఈ పేలుడు సంభవించింది. తూర్పు ఇరాన్లోని తబాస్ గనిలో పేలుడు సంభవించినట్లు అధికారిక IRNA వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 70 మంది ఉద్యోగులు సైట్లో ఉన్నారు.
నివేదిక ప్రకారం.. గనిలోని రెండు బ్లాకులలో పేలుడు సంభవించింది. ఈ గని ప్రైవేట్ ఇరానియన్ సంస్థ మదంజూ యాజమాన్యంలో ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు తబాస్కు అంబులెన్స్లు, హెలికాప్టర్లు సహాయం అందించాయి. అలాగే.. కొంతమంది బాధితుల మృతదేహాలను మైనింగ్ వాహనాలలో ఆస్పత్రికి తీసుకెళ్లాయి. మిగిలిన మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్లు పనిచేస్తున్నాయని సౌత్ ఖొరాసన్ గవర్నర్ జవాద్ ఘెనాట్ స్టేట్ టీవీకి తెలిపారు.
Also Read
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
Snake In Train: రైలు ఏసీ కోచ్లో పాము.. వైరల్ అవుతున్న వీడియో..
ప్రమాదంపై విచారణకు రాష్ట్రపతి ఆదేశించారు
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే. సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. “దురదృష్టవశాత్తూ తబాస్లోని బొగ్గు గనులలో ప్రమాదం జరిగిందని.. మా ప్రజలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలుసుకున్నాము. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పెజెష్కియాన్ అన్నారు.
ఖొరాసన్లో 3 రోజుల బహిరంగ సంతాపం
బాధితులకు, వారి కుటుంబాలకు అత్యవసర సహాయాన్ని అందించడానికి తన మొదటి వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రెజా అరేఫ్ క్యాబినెట్ సభ్యులతో మాట్లాడినట్లు IRNA తెలిపింది. పేలుడు సంభవించిన తరువాత అధికారులు ప్రావిన్స్లో మూడు రోజుల బహిరంగ సంతాప దినాలు ప్రకటించారు. అలాగే.. ఇరాన్ రెడ్ క్రెసెంట్ గని వద్ద శోధన, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని.. ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకున్నారని చెప్పారు. IRNA ప్రకారం, ఈ ఉద్యోగులు భూమి ఉపరితలం నుండి 250 మీటర్ల దిగువన ఉన్నారు.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!