Israel- Iran: ఇజ్రాయెల్పై అణు దాడి చేయాలని ఇరాన్ ప్రజలు డిమాండ్..
- హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్పై ఇరాన్ ఆగ్రహం..
- నెతన్యాహు సర్కార్పై ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఇరాన్ ప్రజలు.. ఇజ్రాయెల్పై అణుబాంబుతో దాడి చేయాలని ఛాందసవాదల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel- Iran: హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్పై ఇరాన్ ఆగ్రహంతో ఉంది. బెంజమిన్ నెతన్యాహు సర్కార్ పై ప్రతీకార చర్యలు తీసుకోవాలని ఛాందసవాదులు డిమాండ్ చేస్తున్నారు. చివరకు అణుబాంబులు ఉపయోగించాలనే స్థాయిలో వారు మాట్లాడుతున్నారు. అలాగే, కీలక హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని సూచనలు జారీ చేస్తున్నారు. పరమ ఛాందసవాది సయీద్ జలీలీ ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ చేతిలో ఓడిపోయారు.
Read Also: Maharashtra: దేశవాళీ ఆవులను రాజ్యమాత- గోమాతగా ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్..
Also Read
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
ఇజ్రాయెల్ దాడుల వేళ.. కొత్త అధ్యక్షుడిపై ఈ ఛాందసవాదులు విమర్శలు చేస్తున్నారు. గాజా, లెబనాన్లో జరుగుతోన్న ఆపరేషన్లపై మసూద్ స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. చమురు రవాణాలో కీలకమైన బాబ్ అల్ మండబ్ జలసంధిని యెమెన్ తన కంట్రోల్లోకి తీసుకుంది.. అలాగే, పాశ్చాత్య నౌకల రాకపోకలు కొనసాగిస్తున్న హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఎందుకు దిగ్బంధించడం లేదని క్వశ్చన్ చేస్తున్నారు.
Read Also: Bunker buster: బంకర్ బస్టర్ అంటే ఏమిటి? నస్రల్లాను ఎలా చంపగలిగింది?
ఇక, ఇజ్రాయెల్ పై అణు దాడి చేయాలనే డిమాండ్లడు వస్తున్నాయి. ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ సొహ్రబ్ సాలేహి ఎక్స్(ట్విట్టర్) వేదికగా.. ఇరాన్ ఇప్పటికే అన్ని అవకాశాలను ఉపయోగించింది.. ఇక మిగిలింది అణు కార్డే.. ఇదే పాశ్చాత్య దేశాలను చర్చలకు కూర్చోబెడుతుందని పేర్కొన్నాడు. అయితే, ఈ డిమాండ్లను వ్యతిరేకిస్తున్న వారు కూడా ఇరాన్ లో ఉన్నారు. హోర్ముజ్ను నియంత్రణలోకి తీసుకోవడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయ్.. అది ఇరాన్ను ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బ తీస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. హసన్ నస్రల్లా మరణం తర్వాత మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని .. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే ఇరాన్ మరింత దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Sayyid Hassan Nasrallah was martyred while busy making plans for defending the defenseless people of Beirut’s Dahiya neighborhood – the same way for tens of years he had planned, strategized, and fought for the oppressed people of Palestine & their occupied cities & villages.
— Khamenei.ir (@khamenei_ir) September 28, 2024
తాజావార్తలు
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..