Iran: ఇరాన్కి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్(IRGC) ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఎస్మాయిల్ ఖానీ శుక్రవారం బీరుట్లో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం బీరూట్పై జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడుల తర్వాత నుంచి మిస్సయినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇరాన్ మీడియా ఇతడి ఆచూకీ గురించి మౌనంగా ఉండగా.. టర్కీష్, ఇజ్రాయిల్ మీడియాలు మాత్రం ఖానీ చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నాయి.
Iran Israel War: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు చేసింది. అందిన సమాచారం మేరకు., ఆదివారం తెల్లవారుజామున గాజా మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ దాడి జరిగింది. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఒక సంవత్సరం పూర్తి చేయబోతున్న సమయంలో సెంట్రల్ గాజా స్ట్రిప్లోని డీర్ అల్-బలాహ్లోని అల్-అక్సా…
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్లో ప్రయాణికుల దగ్గర దొరకడంతో పోలీసులు వాటిని జప్తు చేశారు.
Hassan Nasrallah: ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై దాడిని ముమ్మరం చేసింది. లెబనాన్ వ్యాప్తంగా దాడులు చేస్తోంది. సెప్టెంబర్ 27న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని వైమానిక దాడిలో హతమార్చింది. అంతకుముందు హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్లను హతం చేసింది. వీరిలో అత్యంత కీలకమైన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకిల్, అలీ కర్కీ వంటి వారు ఉన్నారు. అయితే, నస్రల్లాకి బహిరంగ అంత్యక్రియలు నిర్వహించే వరకు అతడిని రహస్య ప్రదేశంలో తాత్కాలికంగా ఖననం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Iran: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం, ఇజ్రాయిల్పై ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ క్షిపణి దాడుల తర్వాత తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఉపన్యసించారు.
PM Modi: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని పిలిచి ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి తరువాత పెరిగిన శత్రుత్వాలపై హోం మంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, ఆర్థిక మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతో కూడిన కమిటీతో పాటు ప్రధాని చర్చించారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారతదేశం అన్ని పార్టీలను కోరింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం…
Iran Israel War: హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా లక్ష్యాలను ఎంపిక చేసి నాశనం చేస్తోంది. హసన్ నస్రల్లాను చంపిన తర్వాత, ఇజ్రాయెల్ మీడియా ఇప్పుడు అతని వారసుడు హషీమ్ సఫీద్దీన్ను చంపినట్లు పేర్కొంది. అందిన సమాచారం ప్రకారం, బీరూట్లో హషీమ్ సఫీద్దీన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం అర్ధరాత్రి భీకరమైన వైమానిక దాడులను చేశాయని.,…
Iran Israel: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం రాబోతోందా..? అనే చర్చ నడుస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాని ఇజ్రాయిల్ దారుణంగా దెబ్బతీసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాతో పాటు దాని ప్రధాన కమాండర్లను దాడుల్లో హతమార్చింది.
అనుకున్నట్టే అయింది.. పశ్చిమాసియా భగ్గుమంటోంది. తమ శత్రుమూకలను వేటాడి వెంటాడి మట్టుపెడుతున్న ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్.. ఇరాన్ ను హెచ్చరించింది. అదే జరిగితే మరింతగా విరుచుకుపడతాం అని ఇరాన్ బదులిచ్చింది. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుంది. దీంతో యుద్ధం వచ్చేసిందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తీవ్రవాద సంస్థలకు మద్దతుగా…
ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. అయితే ఈ దాడి కేవలం క్షిపణుల దాడి మాత్రమే కాదు.. బదులుగా, ఈ క్షిపణులు 700-1000 కిలోల వార్హెడ్ పేలోడ్ను కలిగి ఉన్నాయి. ఇది మొత్తం భవనాన్ని నాశనం చేయగలదు. మన యుద్ధాల చరిత్రలో ఇది అపూర్వమని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అన్నారు.