US F-15 Fighter Jets: మిడిల్ ఈస్ట్కు అమెరికా ఫైటర్ జెట్ విమానాలు..!
- పశ్చిమాసియాలో యుద్ధ విమానాలను మోహరిస్తున్న అమెరికా..
- యూఎస్ ఫైటింగ్ స్క్వాడ్రన్కు చెందిన ఎఫ్-15 స్ట్రైక్ ఈగిల్స్ను మిడిల్ ఈస్ట్కు తరలింపు..
- గల్ఫ్లోని సైనిక స్థావరాలకు చేరిన అమెరికా బీ-52 బాంబర్లు.. బాలిస్టిక్ క్షిపణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US F-15 Fighter Jets: పశ్చిమాసియాలో ఉద్రిక్త నేపథ్యంలో అమెరికా మోహరింపులు వేగవంతమయ్యాయి. తాజాగా ఎఫ్-15 ఫైటర్జెట్లను అక్కడికి తరలించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ఇరాన్ దుందుడుకు చర్యలను కట్టడి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ఈ రోజు (శుక్రవారం) అమెరికా వాయుసేన 492వ ఫైటింగ్ స్క్వాడ్రన్కు చెందిన ఎఫ్-15 స్ట్రైక్ ఈగిల్స్ను మిడిల్ ఈస్ట్కు తరలించామని వెల్లడించారు. ఇవి ఇప్పటికే అక్కడి సెంట్రల్ కమాండ్కు చేరుకొన్నాయని ఆ దేశ సైన్యం సోషల్ మీడియాలో తెలిపింది. ఇప్పటికే అమెరికా బీ-52 బాంబర్లు కూడా గల్ఫ్లోని సైనిక స్థావరాలకు చేరిపోయాయని చెప్పుకొచ్చారు. వీటికి అండగా ట్యాంకర్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డెస్ట్రాయర్స్ను తరలించామని యూఎస్ వెల్లడించింది.
Read Also: Varun Dhawan: సిటడెల్లో సెమీ న్యూడ్ సీన్.. నెటిజన్కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
కాగా, అంతకు ముందే థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అక్కడ మోహరించింది. ఇరాన్, దాని రహస్య ముఠాలు అమెరికా మిలటరీ లేదా ప్రయోజనాలను దెబ్బ తీయాలని ట్రై చేస్తే అడ్డుకొని మా వారిని రక్షించుకోవడానికే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇటీవల వాషింగ్టన్ వార్నింగ్ జారీ చేసింది. ఇరాన్ అతి త్వరలో తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థలు నివేదికలు ఇచ్చింది. ఇరాక్ వైపు నుంచి జరగొచ్చని సమాచారం అందించింది. దీంతో అలర్టైన అమెరికా ఇరాక్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పై దాడులు జరిగిన తర్వాత ఎదురైయ్యే పరిణామాలను బాగ్దాద్ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆరోపణలను మాత్రం ఇరాక్ తప్పుబట్టింది. అక్టోబర్ 1న ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఇరాన్ ఇప్పుడు ఏమైనా దుందుడుకు చర్యలు చేపడితే.. అమెరికా స్పందన ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?