భారత్-శ్రీలంక మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుంది. శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ప్రకటన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మూడు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే…మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి.…
కరోనా మూడో వేవ్ సీరియస్ గా ఉండకపోవచ్చు అని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)కి చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా వ్యాపించే వైరస్ రకం గనక వెలుగులోకి రాకపోతే అంత ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. ఆగస్టు చివర్లో మూడో వేవ్ వస్తుందో, రాదో తెలిసిపోతుందన్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం అసలైన సవాళ్లు అని పేర్కొన్నాడు. ప్రస్తుత జాగ్రత్తల…
క్రికెట్ లవర్స్కి గుడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ. టీ20 ప్రపంచ కప్ డ్రాను విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో చోటు సంపాదించాయి. దీంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు ఉంటుంది. ఇధి అభిమానులకు పండుగనే చెప్పాలి..! యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్ 2021 డ్రాను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించగా,…
ఇండియాలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 38,079 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908 కి చేరింది. ఇందులో 3,02,27,792 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,24,025 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 560 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పటి వరకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… దీంతో.. క్రమంగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్పై దృష్టిసారించాయి.. భారత్లో కూడా ఈ ప్రక్రియ సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.. వ్యాక్సిన్లపై కూడా ఇప్పటికే పలు అధ్యయనాలు జరగగా.. తాజాగా.. వ్యాక్సినేషన్పై ఐసీఎంఆర్ ఆసక్తికర విషయాలను తన అధ్యయనంలో వెల్లడించింది.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్ అధ్యయనం నిర్వహించగా..…
కరోనా ఎఫెక్ట్ తో మూతపడ్డ థియేటర్లు ఇంకా దేశమంతటా పూర్తిగా తెరుచుకోకపోవటంతో డిస్నీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 9న అమెరికా, బ్రిటన్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమా ఇండియాలో బాక్సాఫీస్ కి దూరంగా ఉండనుంది. నేరుగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలిపేలా ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా డిస్నీ ఇండియా సంస్థ చేసింది. అయితే, హాట్ స్టార్ లో ‘బ్లాక్ విడో’…
ఏ సిరీస్ అన్నది కాదు.. అందులో భారత్, పాకిస్థాన్ ఉన్నాయా..? మరీ ముఖ్యంగా.. ఆ రెండు జట్లు ఎప్పుడు తలపటబోతున్నాయి అనే ఉత్కంఠ సగటు క్రికెట్ ప్రేమికుల్లో ఉంటుంది.. ఇక, భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే.. ఎప్పుడూ క్రికెట్ను అంతగా చూడనివారు కూడా ఆ రోజు ఆసక్తిగా వీక్షిస్తుంటారు.. ఇలా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుంది అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను టీ-20 వరల్డ్కప్ తీర్చబోతోంది… ఇంకో విషయం ఏంటంటే.. టీ20 వరల్డ్కప్లో…
భారత్లో స్మార్ట్ఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిమాండ్కు అనుగుణంగానే కొత్తకొత్త బ్రాండ్లు, మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రతినెలా పదుల సంఖ్యలో మొబైల్ మోడల్స్ దర్శనమిస్తున్నాయి. ఇక చౌకైన డేటా ఆఫర్లు, అందుబాటు ధరల్లో ఫోన్లతో దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా మనదేశంలో స్మార్ట్ఫోన్లు వాడేవారి సంఖ్య జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాపారాలు ఎక్కువ అవ్వడం, విద్యార్థుల ఆన్లైన్ క్లాసులతో మొబైల్స్ అమ్మకాలు మరింత ఎక్కువ…
కరోనాను కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని టీకాలు ట్రయల్స్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టీకాలను శీతలీకరణ గడ్డంగుల్లో భద్రపరచాల్సిన టీకాలే. ఇండియాలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు 2నుంచి 8 డిగ్రీల వరకు ఫ్రీజింగ్ చేయాలి. ఫైజర్, మోడెర్నా టీకాలను మైనస్ 70 డిగ్రీల వద్ధ స్టోర్ చేయాలి. అయితే,…
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్నటి బులిటెన్ ప్రకారం రోజువారీ కేసులు 40వేలకు పైగా నమోదవ్వగా, ఈరోజు రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం కేసులు 40 వేలకు దిగువున నమోదయ్యాయి. ఇండియాలో కొత్తగా 38,949 కేసులు నమోదవ్వగా, 542 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829కి చేరింది. ఇందులో 3,01,83,876 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,30,422 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. Read: “ఆదిపురుష్”…