కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే దేశంలో మరో వైరస్ ఇబ్బందు తెచ్చిపెడుతున్నది. పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకుతున్నది. బర్డ్ఫ్లూ వైరస్తో 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు దృవీకరించారు. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఐసోలేషన్కు వెళ్లాలని, ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచించారు. ఈనెల 2 వ తేదీన హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా, లుకేమియా లక్షణాలతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరాడు.
Read: పోర్నోగ్రఫీ కేసు… రాజ్ కుంద్రా బిగ్గెస్ట్ కాంట్రవర్సీలు!
మొదట బాలుడికి కరోనా టెస్టులు నిర్వహించగా నెగెటివ్ గా రావడంతో శాంపిల్స్ను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపగా బర్డ్ఫ్లూ వైరస్ సోకినట్టు నిర్ధారణ జరిగింది. బర్డ్ఫ్లూతో చికిత్స పొందుతూ మరణించడంతో బాలుడి కాంటాక్ట్ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ హర్యానాకు బృందాన్ని పంపింది. ఆసుపత్రిలో చేరే ముందు బాలుడి కాంటాక్ట్ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. బర్డ్ఫ్లూ సాధారణంగా పక్షులకు సోకుతుంది. అయితే, పక్షుల నుంచి మనుషులకు సోకడం ఇండియాలో ఇదే మొదటిసారి. ఈ ఏడాదిలో అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో వేలాది కోళ్లు, పక్షులు మృతి చెందిన సంగతి తెలిసిందే.