Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin: 2026 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ వెన్నెముకగా నిలిచారు. టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమైనా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చి సంచలన ఇన్నింగ్స్లతో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టారు. అయితేవరల్డ్ కప్ హీరో సంజుపై అశ్విన్ కోపంగా ఉన్నారు. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో
Also Read
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
- India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
సంజు విధ్వంసం.. అశ్విన్ విశ్లేషణ..
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అశ్విన్, సంజు ఆటతీరును ప్రశంసిస్తూనే ఒక అభిమానిగా తన అసంతృప్తిని బయటపెట్టారు. “ఒక క్రికెటర్గా, బ్యాట్స్మన్గా సంజు ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేయాల్సింది. అతను వెస్టిండీస్పై 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు, కానీ ఒక అభిమానిగా అతను ఆ మూడు సెంచరీలు పూర్తి చేసి ఉండాలని కోరుకున్నాను. కేవలం 10 సింగిల్స్ తీసి ఉంటే అతను సులభంగా సెంచరీ మార్కును అందుకునేవాడు.” అని అశ్విన్ పేర్కొన్నారు. సంజు శామ్సన్ తన వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాడని అశ్విన్ కొనియాడారు. “సంజు ఎప్పుడూ తన కోసం ఆడడు. ఉద్దేశపూర్వకంగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తాడు. సెంచరీ కోసం పాకులాడకుండా పెద్ద షాట్లు ఆడుతూ అవుట్ అవ్వడమే అతని ప్రత్యేకత. అదే అతడిని అందరికీ ఇష్టమైన ఆటగాడిగా మార్చింది. కానీ, అంత గొప్పగా ఆడి కూడా సెంచరీ సాధించలేకపోవడం నాకు బాధ కలిగిస్తోంది.” అని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రపంచకప్లో సంజు శామ్సన్ కేవలం 321 పరుగులు చేయడమే కాకుండా, అత్యంత కీలక సమయాల్లో రాణించారు. వెస్టిండీస్పై 97* పరుగులు చేసి భారత్ను సెమీఫైనల్కు చేర్చారు. ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో 89 పరుగులతో భారీ స్కోరు అందించారు. న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో మరోసారి 89 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆరంభంలో అవకాశాలు రాకపోయినా, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శామ్సన్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్గా మారారు.
READ ALSO: Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!