Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin: 2026 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ వెన్నెముకగా నిలిచారు. టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమైనా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చి సంచలన ఇన్నింగ్స్లతో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టారు. అయితేవరల్డ్ కప్ హీరో సంజుపై అశ్విన్ కోపంగా ఉన్నారు. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో
Also Read
- Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
- AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
- Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
- Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్గా రికార్డు..
సంజు విధ్వంసం.. అశ్విన్ విశ్లేషణ..
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అశ్విన్, సంజు ఆటతీరును ప్రశంసిస్తూనే ఒక అభిమానిగా తన అసంతృప్తిని బయటపెట్టారు. “ఒక క్రికెటర్గా, బ్యాట్స్మన్గా సంజు ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేయాల్సింది. అతను వెస్టిండీస్పై 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు, కానీ ఒక అభిమానిగా అతను ఆ మూడు సెంచరీలు పూర్తి చేసి ఉండాలని కోరుకున్నాను. కేవలం 10 సింగిల్స్ తీసి ఉంటే అతను సులభంగా సెంచరీ మార్కును అందుకునేవాడు.” అని అశ్విన్ పేర్కొన్నారు. సంజు శామ్సన్ తన వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాడని అశ్విన్ కొనియాడారు. “సంజు ఎప్పుడూ తన కోసం ఆడడు. ఉద్దేశపూర్వకంగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తాడు. సెంచరీ కోసం పాకులాడకుండా పెద్ద షాట్లు ఆడుతూ అవుట్ అవ్వడమే అతని ప్రత్యేకత. అదే అతడిని అందరికీ ఇష్టమైన ఆటగాడిగా మార్చింది. కానీ, అంత గొప్పగా ఆడి కూడా సెంచరీ సాధించలేకపోవడం నాకు బాధ కలిగిస్తోంది.” అని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రపంచకప్లో సంజు శామ్సన్ కేవలం 321 పరుగులు చేయడమే కాకుండా, అత్యంత కీలక సమయాల్లో రాణించారు. వెస్టిండీస్పై 97* పరుగులు చేసి భారత్ను సెమీఫైనల్కు చేర్చారు. ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో 89 పరుగులతో భారీ స్కోరు అందించారు. న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో మరోసారి 89 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆరంభంలో అవకాశాలు రాకపోయినా, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శామ్సన్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్గా మారారు.
READ ALSO: Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!