Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin: 2026 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ వెన్నెముకగా నిలిచారు. టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమైనా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చి సంచలన ఇన్నింగ్స్లతో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టారు. అయితేవరల్డ్ కప్ హీరో సంజుపై అశ్విన్ కోపంగా ఉన్నారు. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో
Also Read
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
సంజు విధ్వంసం.. అశ్విన్ విశ్లేషణ..
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అశ్విన్, సంజు ఆటతీరును ప్రశంసిస్తూనే ఒక అభిమానిగా తన అసంతృప్తిని బయటపెట్టారు. “ఒక క్రికెటర్గా, బ్యాట్స్మన్గా సంజు ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేయాల్సింది. అతను వెస్టిండీస్పై 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు, కానీ ఒక అభిమానిగా అతను ఆ మూడు సెంచరీలు పూర్తి చేసి ఉండాలని కోరుకున్నాను. కేవలం 10 సింగిల్స్ తీసి ఉంటే అతను సులభంగా సెంచరీ మార్కును అందుకునేవాడు.” అని అశ్విన్ పేర్కొన్నారు. సంజు శామ్సన్ తన వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాడని అశ్విన్ కొనియాడారు. “సంజు ఎప్పుడూ తన కోసం ఆడడు. ఉద్దేశపూర్వకంగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తాడు. సెంచరీ కోసం పాకులాడకుండా పెద్ద షాట్లు ఆడుతూ అవుట్ అవ్వడమే అతని ప్రత్యేకత. అదే అతడిని అందరికీ ఇష్టమైన ఆటగాడిగా మార్చింది. కానీ, అంత గొప్పగా ఆడి కూడా సెంచరీ సాధించలేకపోవడం నాకు బాధ కలిగిస్తోంది.” అని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రపంచకప్లో సంజు శామ్సన్ కేవలం 321 పరుగులు చేయడమే కాకుండా, అత్యంత కీలక సమయాల్లో రాణించారు. వెస్టిండీస్పై 97* పరుగులు చేసి భారత్ను సెమీఫైనల్కు చేర్చారు. ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో 89 పరుగులతో భారీ స్కోరు అందించారు. న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో మరోసారి 89 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆరంభంలో అవకాశాలు రాకపోయినా, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శామ్సన్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్గా మారారు.
READ ALSO: Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!