Konda Lakshma Reddy: కొండా లక్ష్మారెడ్డి (84) ఇక లేరు. తెలంగాణ రాజకీయాల్లో విషాదం నింపుతూ.. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. IND vs AUS: వన్డే చరిత్రలోనే అతిపెద్ద ఛేజ్.. టాప్ 5లో నాలుగు రికార్డులు ఆస్ట్రేలియావే! చేవెళ్ల మాజీ…
వైద్యులను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఘటనలు వైద్యులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయంటున్నారు పలువురు వ్యక్తులు. తాజాగా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఏఐజీలో చేరాడు. వైద్యం చేసేందుకు రూ. 35 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నారని బాధిత కుటంబం తెలిపింది. బాధితులు ఇల్లు అమ్ముకుని మరి హాస్పిటల్ లో లక్షల్లో బిల్లు చెల్లించామని తెలిపారు. Also Read:Rashi Khanna :…
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. రేపటి నుంచి మొదలు 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. Also Read:…
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు మారడం లేదు. వనస్థలిపురం గుర్రంగూడ వద్ద కారు బీభత్సం సృష్టించింది. యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టి బోల్తా పడింది థార్ కారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. థార్ కారు ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also…
టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ కాలనీలో ఒక డీసీఎం డ్రైవర్ లేబర్ లతో కలిసి సత్య మ్యాగ్నము నుంచి రాహుల్ కాలనీలో రెండవ అంతస్తుకి లిఫ్ట్లో సామాన్లు తీసుకెళ్లారు. ఇది గమనించిన కామ్రాన్ అనే వ్యక్తి లేబర్ల పై దుర్భాషలాడి వారిపై చేయి చేసుకున్నాడు. లేబర్లను ఎందుకు కొట్టారని డీసీఎం డ్రైవర్ ఫారుక్ వెళ్లి ప్రశ్నించగా కామ్రాన్ ఫారూఖ్ ని ఎయిర్ గన్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన డీసీఎం డ్రైవర్ ఫారుఖ్ వెంటనే…
కుటుంబ కలహాలు, ఆస్తుల పంచాయితీలతో తల్లిదండ్రులపై పిల్లలు దాడులకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పిల్లల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు అంతమొందిస్తున్నారు. తాజాగా ఉమానగర్, పంజాగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న యువకుడిని స్వంత తల్లి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హర్ష వర్ధన్ (27) గా పోలీసులు గుర్తించారు. ఆయన తల్లి గంగులమ్మ (50) ఇళ్లలో పనులు చేస్తూ…
శంషాబాద్ విమానాశ్రయంలో మరో మారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయ్యింది. అంటోనోవ్ ఎన్ 124 సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటోనోవ్ ఎన్ 124 ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలలో ఒకటి. క్వాడ్ ఇంజిన్ అంటే 4 ఇంజన్లు ఉన్నాయి. 24 చక్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటి, దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్, అన్లోడ్ కోసం రాంప్లను ఉపయోగించి…
ఓ వైపు కొడుకు అనారోగ్యం.. మరోవైపు కుటుంబాన్ని పట్టించుకోని భర్త.. పైగా ఆర్ధికంగా రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. పెద్ద కొడుకుపై దొంగతనం ముద్ర పడడంతో మానసికంగా మరింత కుంగిపోయింది. ఆ తల్లి అలసిపోయి.. ఇక బతకలేనని నిర్ణయించుకుంది. పుట్టెడు దుఃఖంతో చిన్న కొడుకు కళ్లెదుటే బలవన్మరణం చెందింది. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్లో విషాదం నింపింది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వారి పేర్లు నరసింహ, సుధ. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరు. సుధ,…
హైదరాబాద్లో పొలిటికల్ ఫ్యామిలీ స్టార్స్కు దిక్కులేకుండా పోయిందా? తండ్రులు ఓ వెలుగు వెలిగిపోగా… వారసులు ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతున్నారా? బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ వాళ్ళని లైట్ తీసుకున్నాయా? ఫేడౌట్ అయిపోవడానికి కారణం వాళ్ళలో సత్తా లేకపోవడమా? లేక పార్టీల పట్టింపులేని తనమా? ఎక్కడుంది లోపం? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగబోతున్న టైంలో… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతల వారసుల వైపు మళ్లుతోంది చర్చ. ఒకప్పుడు గ్రేటర్…
StoryBoard: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కష్టాలు కొనితెచ్చుకుంటోంది. సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం మంత్రి పదవులు పొంది నేతలు.. కలిసికట్టుగా ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సిందిపోయి.. తమలో తామే కలహించుకుంటున్నారు. పోనీలే బయటపడటం లేదుగా అని ఇన్నాళ్లూ పార్టీ క్యాడర్ సరిపెట్టుకుంది. కానీ ఆ ఊరట కూడా వారికి దక్కకుండా చేస్తూ.. మంత్రి పొన్నం ప్రభాకర్.. తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై రెచ్చిపోయారు. ఏకంగా దున్నపోతు అంటూ నోరుపారేసుకున్నారు. అదీ ప్రెస్మీట్లో ఈ ఘటన జరగడంతో..…