CM Revanth Reddy : హైదరాబాద్ లోని హయత్ నగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూగ బాలుడు ప్రేమ్ చంద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఉదయం పత్రికల్లో ఈ వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే, బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,…
HYDRA : పాతబస్తీకి తలమానికంగా నిలిచే చారిత్రక బమృక్నుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతూ ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో ఈ చెరువును ప్రజలకు అర్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో ఆక్రమణలతో నాశనం అయిన ఈ చెరువు, హైడ్రా చేపట్టిన సమగ్ర అభివృద్ధి చర్యలతో మళ్లీ తన పాత ఔన్నత్యాన్ని తిరిగి పొందుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం చెరువు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు…
IT Raids On Restaurants: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేపట్టిన దాడులు, విచారణలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. నవంబర్ 18న ప్రారంభమైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్ (Pista House), షాగౌస్ (Shah Ghouse), మేహ్ ఫిల్ (Mehfil) వంటి ప్రముఖ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలు,…
New Year 2026 Permissions: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ 2026 వేడుకలు నిర్వహించాలని భావిస్తున్న హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా పొందాల్సిందిగా పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ నైట్ వేడుకలకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఈ అనుమతుల కోసం డిసెంబర్ 21, 2025 వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అనుమతి కోసం…
Child Abuse Case: హైదరాబాద్లోని షాపూర్నగర్లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఆయా అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్ణిమ స్కూల్లో జరిగిన ఈ దారుణంపై విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకొని స్కూల్ను సీజ్ చేసింది. బాధిత చిన్నారి ప్రస్తుతం కోలుకుంటోంది. అభం శుభం తెలియని చిన్న పాపపై ఈ అమానుష హింస అందరిని కలచివేసింది. పాప తండ్రితో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఆయా లక్ష్మి, చిన్నారిని స్కూల్ ప్రాంగణానికి…
iBomma Ravi: సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు, ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రవిపై మరొక మూడు కేసులు నమోదు కావడంతో, ఆయన్ని ఈ కేసుల్లో కూడా కోర్టు ముందు హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ లోపు ఈ కేసుల్లో రవిని…
IBomma Ravi : హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ ఐబొమ్మ రవి పై మరో విడత కస్టడీ కఠిన విచారణ జరిపింది. రవి తన మెయిల్ అకౌంట్స్ రిట్రైవ్ చేసిన విషయాలను పోలీసులకు వివరించాడు. పోలీసులు గుర్తించినట్టు, ఐబొమ్మ, బప్పం వెబ్సైట్స్లో 21,000కి పైగా సినిమాలు పైరసీ చేయబడి ఉంటాయి. పోలీసుల పరిశీలనలో, రవి పైరసీ వెబ్సైట్స్ నుండి సినిమాలను రికార్డింగ్ చేసి, ఓటీటీ ప్లాట్ఫారమ్లపై వచ్చే సినిమాలను కూడా కాపీ చేశాడని గుర్తించారు. ఈ సినిమా…
Lionel Messi : ఫుట్బాల్ ప్రపంచాన్ని తన ప్రతిభతో మంత్రముగ్ధులను చేసిన ఆర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ ఈ డిసెంబర్లో హైదరాబాద్ రానున్నాడు. The G.O.A.T India Tour – 2025లో భాగంగా భారత పర్యటనకు సిద్ధమైన మెస్సీ, ఈ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ను సందర్శించనున్నట్టు అధికారికంగా వెల్లడైంది. ఫుట్బాల్ అభిమానులకు ఇది అద్భుతమైన అవకాశంగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ ప్రమోషన్లో భాగంగా, మెస్సీని రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్గా…
ఐటీ రాజధాని హైదరాబాద్, గచ్చిబౌలి లో సరికొత్త షోరూమ్ ద్వారా తన రిటైల్ బ్రాండ్ విస్తృతిని పెంచుతున్న ఆర్.ఎస్. బ్రదర్స్ ! ఆర్.ఎస్. బ్రదర్స్ మరో మైలురాయిని అధిగమిస్తోంది. నవంబర్ 27వ తేదీనాడు తన 16వ షోరూమ్ ను హైదరాబాద్ గచ్చిబౌలిలో శుభారంభం చేస్తోంది. పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి, ప్రసాద్ రావు, దివంగత పి. సత్యనారాయణ స్థాపించిన ఈ సంస్థ తన విజయవంతమైన రిటైల్ ప్రస్థానంలో ఒక విశిష్టమైన బ్రాండు గా చరిత్ర సృష్టించి. అటు సంప్రదాయాన్నీ,…
Indrajaal Ranger: హైదరాబాద్లో ఈరోజు ప్రపంచపు తొలి మొబైల్, AI ఆధారిత యాంటీ-డ్రోన్ పెట్రోల్ వెహికల్ ‘ఇంద్రజాల్ రేంజర్’ (Indrajaal) అధికారికంగా లాంచ్ అయ్యింది. సాధారణంగా ఒకేచోట స్థిరంగా ఉండే యాంటీ-డ్రోన్ సిస్టమ్లకు భిన్నంగా.. ఇది కదులుతున్న డ్రోన్లను గుర్తించి, ట్రాక్ చేసి, నిర్వీర్యం చేసే సామర్థ్యంతో రూపొందించబడిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వాహనం. యాంటీ-డ్రోన్ టెక్నాలజీ అవసరం ఎందుకు? ఇటీవలి కాలంలో బార్డర్ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, స్మగ్లింగ్ వస్తువులు తరలింపు కేసులు…