రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. మరొకరితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు కొందరు భార్యలు, భర్తలు. మహిళలు మాత్రం వాళ్ల ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తి.. అతని స్నేహితుడితో కలసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి సుమిత్రానగర్లో నివాసం ఉంటున్న..భూపాల్ అనే వ్యక్తిపై.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న…
Crime News: ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో మృతదేహలకు సంబంధించి కేసులు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో మృతదేహం రోడ్డుపై ప్రత్యక్షమైంది. శంషాబాద్ నుండి ఆరంఘర్ వైపు వెళ్లే దారిలో సర్వీస్ రోడ్డుపై మృతదేహం కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అక్కడ పడి ఉండటాన్ని చూసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. USA క్రికెట్ బోర్డు సభ్యత్వం సస్పెండ్.. ICC కీలక నిర్ణయం సంఘటన…
రోజు రోజుకు హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ ఉత్త మాటలుగా మారింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిజ్జా ప్రియులకు కొదువ లేదు. కానీ తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలతో పిజ్జా హౌస్లను షాక్ చేశారు.
తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టే గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సిటీ విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రజలు గ్రేటర్ సిటీకి లక్షలాది కుటుంబాలు…
తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపుల కారణంగా ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. కుండపోత వర్షం పలు కుటుంబాల్లో విషాధాన్ని నింపింది. ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం (మం) చల్పాక గ్రామంలో లో పిడుగు పడి ఊకె కృష్ణ కృష్ణ అనే రైతు మృతి చెందాడు. చిట్టిబాబు అనే మరో రైతుకు గాయాలు అయ్యాయి. పంట పొలంలో పనులకు వెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా,…
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ మహిళ కేసుని పోలీసులు చేధించారు. యాకుత్ పూరా కు చెందిన మహిళను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్లు డిపో వద్ద సోయి లేకుండా పడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. టౌలీ చౌకీ కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ హైదర్ గూడ వద్ద మద్యం మత్తులో పడి ఉన్న మహిళను బలవంతంగా ఆటో లో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజేంద్రనగర్…
హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఫిలింనగర్లో ప్రాంతాలలో వర్షం దంచికొడుతోంది. కుండపోతగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.…
హైదరాబాద్లో జరుగుతున్న ఓజీ కన్సర్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వర్షంలో కూడా తడుస్తూ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చేతిలో సినిమాలో వాడిన జపనీస్ కత్తితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో కనిపించారు. సింగిల్గా నడుస్తూ వచ్చిన ఆయన సింపుల్గా అలా వచ్చి స్టేజి మీద కూర్చుండడంతో, ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ అదిరిపోయారు. ఒకపక్క తమన్ అండ్ టీం లైవ్ సాంగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో, ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. దానికి…
లోన్ యాప్స్ లో అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కొందరు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు తమకు తామే కిడ్నాప్ ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యుల నుంచే డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరికి తెగబడ్డాడు. బంజారాహిల్స్ లో ఆడవేషంలో వచ్చి బంగారం డబ్బును దోచుకెళ్లాడు హర్షిత్. లోన్ యాప్ ల ద్వారా అప్పులు చేసి, అప్పులు తీర్చాలని…