Tragedy: అయ్యో దేవుడా.. కడుపులో ఉన్న కవలలు మృతి.. చికిత్స పొందుతూ తల్లి మృతి.. పిల్లలు, భార్య మృతి తట్టుకోలేక భర్త..
- శంషాబాద్ లో విషాదం
- గర్భిణి కడుపులో ఉన్న కవలలు మృతి
- చికిత్స పొందుతూ తల్లి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ దంపతులు పెళ్లై ఏడేళ్లైన పిల్లలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది ఆ మహిళ. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. విధి ఆడిన వింతనాటకంలో కడుపులోని పిల్లలతో సహా భార్యాభర్తలు కూడా మృతిచెందారు. ఈ విషాద ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందారని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలను ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఐన్స్ప్సెక్టర్ బాల్రాజ్ వివరించారు… కర్ణాటక బెంగుళూరు రాష్ట్రానికి చెందిన ముత్యాల విజయ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శంషాబాద్ లోని సామ ఎన్క్ల్యూవ్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అయితే ప్రవీణ్ భార్య శ్రావ్య ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఆమెకు చెకప్ చేయించేందుకు అత్తాపూర్ లోని బట్టర్ ఫ్లై హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
Also Read:HIV Cases: పారిశ్రామిక వాడలో రోజురోజుకు పెరుగు తున్న హెచ్ ఐవీ కేసులు..
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
వారి వెంట శ్రావ్య తల్లి కూడా వచ్చింది. బట్టర్ ఫ్లై హాస్పిటల్ డాక్టర్లు శ్రావణిని చెకప్ చేసి కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారు వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శ్రావ్యకు మెరుగైన చికిత్స అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమెను గుడిమల్కాపూర్ లోని మైత్రి హాస్పిటల్ కి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించింది. దీంతో శ్రావ్యను హుటాహుటిన నగరంలోని సరోజిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న సమయంలో కడుపులో ఉన్న ఇద్దరు కవలలు శ్రావ్య మృతి చెందారు. విషయాన్ని శ్రావ్య తల్లికి డాక్టర్లు తెలియజేశారు. ఈ విషయాన్ని విజయ్ కు ఫోన్ ద్వారా చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయ్ శంషాబాద్ లోని తన రూమ్ కు వెళ్లాడు.
Also Read:Priyanka Chopra : చీరలో ప్రియాంక చోప్రా.. కత్తిలాంటి అందాలు చూశారా
ఆ తర్వాత విజయ్ కోసం వెతికిన అతని మేనమామ ఫోన్ చేశాడు. కానీ విజయ్ రెస్పాండ్ కాకపోవడంతో హుటాహుటిన విజయ్ మేనమామ శంషాబాద్ లోని రూమ్ కు వచ్చి చూడగా రూమ్ లో విజయ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ మేనమామ విజయ్ అన్నయ్య ప్రవీణ్ కు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన శంషాబాద్ లోని సామ ఎన్ క్లేవ్ కు చేరుకున్నాడు. చున్నీకి వేలాడుతూ ఉన్న తన తమ్ముణ్ణి చూసిన ప్రవీణ్ శోకసముద్రంలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ భార్య కడుపులో ఇద్దరు పిల్లలు తండ్రి ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయింది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..