Jubilee Hills by-election: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం..
- జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం..
- బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్పై భారీ మెజార్టీతో గెలుపు..
- విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jubilee Hills by-election: ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.. సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీతా గోపినాథ్పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యదవ్.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్.. అయితే, ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్ యాదవ్.. పోస్ట్ బ్యాలెట్లు మొదలు కొని.. ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ.. తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు.. కౌంటింగ్ మధ్యలోనూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్ రెడ్డి..
Read Also: Bihar Election Results: బీహార్లో “ని-మో” జోడి ప్రభంజనం.. అండగా నిలిచిన మహిళలు..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
తొలి రౌండ్లో కాంగ్రెస్కు 8,911 ఓట్లు రాగా.. బీఆర్ఎస్కు 8,864 ఓట్లు వచ్చాయి.. దీంతో, తొలి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేసినట్టు అయ్యింది.. ఇక, రెండో రౌండ్లో కాంగ్రెస్ లీడ్ 2,948 ఓట్లకు చేరింది.. మూడో రౌండ్లోనే కాంగ్రెస్కు 2,999 ఓట్ల ఆధిక్యం లభించడంతో.. మడో రౌండ్ పూర్తి అయ్యే సరికి హస్తం పార్టీ 6,012 ఆధిక్యంలోకి వెళ్లింది.. నాల్గో రౌండ్లో 3,547 ఓట్ల ఆధిక్యం లభించడంతో.. ఆ రౌండ్ కంప్లీట్ అయ్యే సరికి మొత్తం లీడ్ 9,559కి పెరిగింది.. ఇక, ఐదో రౌండ్లో 3,300 ఓట్ల ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రౌండ్ పూర్తి అయ్యే సరికి మొత్తం 12,857 ఓట్ల లీడ్లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. మరోవైపు, ఆరో రౌండ్లో 2,938 ఓట్ల ఆధిక్యం, ఏడో రౌండ్లో 4,000 ఓట్ల ఆధిక్యంతో.. ఏడు రౌండ్లు పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్ ఆధిక్యం 19,797 వేలకు చేరింది.. ఎనిమిదో రౌండ్లో కూడా ఆధిక్యం దక్కడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం 20 వేల మార్క్ను దాటేసి.. 21,672కి చేరుకుంది.. తొమ్మిదో రౌండ్లో కూడా ఆధిక్యం పెరిగిన నేపథ్యంలో.. కాంగ్రెస్ అభ్యర్థికి 23,921 ఆధిక్యం లభించింది.. ఇక, చివరిదైన పదో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది.. దీంతో, 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ఘన విజయం సాధించారు.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్పై నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ కొట్టగా.. బీజేపీ అభ్యర్థి దీపక్రెడ్డి డిపాజిట్ గల్లంతు అయ్యింది..
తాజావార్తలు
-
Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
-
IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్కు భారీ షాక్?
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!