Sangareddy Crime: ఆస్తి కోసం ఐదు రోజులు ఆస్పత్రిలోనే శవం ఘటన సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట (మం) తంగేడుపల్లిలో సంచలనం సృష్టించింది. ఆస్తి ఇచ్చేంత వరకు భర్త అంత్య క్రియలు జరిపేది లేదని తేల్చి చెప్పింది.
సంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి మాదిరి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. ఈ ఘటన సదాశివపేట (మం) తంగేడుపల్లిలో జరిగింది. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అన్న దానికి ఇదే నిదర్శనం.. వివరాల్లోకి వెళ్తే, తన భర్త ఐదు రోజుల క్రితం చనిపోయాడు. అయితే.. అప్పటి నుంచి ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. కాగా,…
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ వింత కేసు వెలుగు చూసింది. మహిళా పోలీస్ స్టేషన్లో నడుస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని విని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
భారతదేశంలో వైవాహిక జీవితాన్ని బండితో పోల్చారు. ఇందులో భార్యాభర్తలు బండి చక్రాలుగా ఉంటారు. ఒక చక్రం విరిగిపోయినా.. ఈ వైవాహిక జీవితం ముందుకు సాగదు. భార్యాభర్తల మధ్య బంధం ఎంత పటిష్టంగా ఉంటే అంత సున్నితంగా ఉండడానికి ఇదే కారణం.
ఒక వ్యక్తి రక్షణ కోసం తన ఇంట్లో.. బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఎవరైనా దొంగలు పడినా.. లేదంటే అజ్ఞాత వ్యక్తులు వచ్చినా కనిపెట్టడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. సీసీ కెమెరాలు పెట్టింది ఒక ఉద్దేశంతో పెడితే.. అందులో రికార్డైన దృశ్యాలు చూసి అవాక్కయ్యాడు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో మరో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త.. కన్న ఇద్దరు కుమారులు ఒకేసారి మృతిచెందడంతో.. రెండు రోజులు తీవ్ర మనస్థాపంతో ఉన్న భార్య దేవి.. చివరకు తాను కూడా ప్రాణాలు విడిచింది..
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై అవినీతి ఆరోపణలను తన భర్తే బయటపెట్టాడు. ప్రతిరోజు లంచం తీసుకురానిది ఇంటికి రాదని భర్త సంచలన ఆరోపణలు చేశాడు.
జీవితాంతం తోడునీడలా కలిసి జీవిస్తామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలెదురొచ్చినా చివరి వరకు కలిసి ఉంటామని పెళ్లితో ముందడుగు వేస్తారు. ఈ జీవిత ప్రయాణంలో తన తోడును కోల్పోతే ఆ బాధ వర్ణణాతీతం. కేవలం దానిని అనుభవించేవారికే దాని విలువ తెలుస్తుంది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు.
Hindupuram: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ల వేమారెడ్డికి భార్య నీలపు బాల గట్టి షాక్ ఇచ్చింది. భీమవరంలో పెళ్లయ్యాక తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు అతడు.
Divorce Case: తాజాగా చైనా దేశంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. 20 సంవత్సరాల పాటు సజావుగా కొనసాగుతున్న వివాహ బంధాన్ని విడదయడానికి అంగీకరించని భర్త కోర్టులోనే ఓ విచిత్ర సంఘటనకు పాల్పడ్డాడు. విడాకులకు సంబంధించి జడ్జిమెంట్ జరుగుతున్న సమయంలో వ్యక్తి తన భార్యను భుజాలపై ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. చట్టపరమైన విచారణ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన జరగడంతో ఈ విషయం కాస్త ప్రపంచ…