Crime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. రహస్యం బయటపెట్టిన కొడుకు
- యూపీలోని షాజహాన్పూర్లో సంచలన కేసు
- ప్రియురాలు ప్రియుడితో కలిసి భర్త తలను ఇటుకతో బాది హత్య
- భర్త మృతదేహంపై ఇటుకలను పడేసిన నిందితులు
- రాత్రి ఇటుకలు పడిపోవడంతో భర్త మృతి చెందాడని చెప్పిన భార్య
- అసలు విషయాన్ని బయటపెట్టిన ఏడేళ్ల కొడుకు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని షాజహాన్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ప్రియుడితో కలిసి భర్త తలను ఇటుకతో బాది హత్య చేసింది. అనంతరం.. భర్త మృతదేహంపై ఇటుకలను పడేశారు. ఉదయం తన తల్లి ఇంటికి వెళ్లిన భార్య రాత్రి ఇటుకలు పడిపోవడంతో భర్త మృతి చెందాడని చెప్పింది. మృతదేహంపై తల తప్ప మరెక్కడా గాయాలు లేకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా.. తన తల్లి, ప్రియుడితో కలిసి తన నాన్నను హత్య చేసిన మొత్తం కథను ఏడేళ్ల కొడుకు అలీషాన్ పోలీసులకు వివరించాడు. దీంతో.. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రేమికుడు పరారీలో ఉన్నాడు.
Read Also: YSRCP: జగన్ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు.. పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపు
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
ఈ ఘటన తఖుర్ద్కలన్ గ్రామంలో చోటుచేసుకుంది. భర్త.. 40 ఏళ్ల యూనస్ గ్రామంలో టిన్ షెడ్లో నివసిస్తున్నాడు. అతని భార్య షమింబానో.. 20 ఏళ్ల కుమారుడు రిజ్వాన్, 15 ఏళ్ల కుమారుడు సావాన్, 7 ఏళ్ల కుమారుడు అలీషాన్ ఇంట్లో నివసిస్తున్నారు. యూనస్ అత్తమామల ఇల్లు కూడా అదే గ్రామం. కాగా.. తన కొడుకు రిజ్వాన్కు కూడా అదే గ్రామంలో సంవత్సరం క్రితం వివాహం చేశాడు. రిజ్వాన్ బావమరిది మనోస్ అలీకి.. రిజ్వాన్ తల్లి షమీంబనోతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న భర్త యూనస్ తన భార్య షమీబాన్ను కనిపెట్టుకుంటూ ఉన్నాడు. 8 రోజుల క్రితం గ్రామస్థులు షమీంబనో, మనోస్ అలీని చెరువు ఒడ్డున అభ్యంతరకరమైన స్థితిలో చూశారు. ఈ క్రమంలో.. బంధువుల మధ్య పంచాయితీ కూడా జరిగింది. యూనస్ రాజీకి వచ్చాడు. యూనస్ కుమారులు రిజ్వాన్, సావాన్ ఢిల్లీకి కూలి పనికి వెళ్లారు. షమింబానో ఆమె తల్లి ఇంట్లో ఉంది.
Read Also: Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
శుక్రవారం రాత్రి, మనుస్ అలీ తన ఇంటికి షమీంబనోను కలవడానికి వచ్చాడు. దానికి యూనస్ నిరసన తెలిపాడు. మనుస్ అలీ, షమింబానోలు నిరసన వ్యక్తం చేయడంతో వారు యూనస్ తలపై ఇటుకలతో కొట్టారు. ఈ సమయంలో.. యూనస్ 7 ఏళ్ల కుమారుడు అలీషాన్ నిద్ర నుండి లేచి తన తండ్రిని కొట్టడం చూసి అరవడం ప్రారంభించాడు. “మమ్మీ, అబ్బుజాన్ను చంపవద్దు” అని అరిచాడు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి కొడుకుని బెదిరించారు. ఈ విషయాలన్నీ పోలీసులు, బంధువుల ముందు చెప్పిన అలీషాన్.. తండ్రి హత్యను బయటపెట్టాడు. ఈ క్రమంలో.. భార్య షమీంబనోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ప్రియుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- Tags
- boyfriend
- husband
- Killed
- son
- telugu news
తాజావార్తలు
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!