Chhattisgarh: ఫోన్ అధికంగా వాడుతున్న భార్య.. రెండో ఫ్లోర్ నుంచి తోసేసిన భర్త
- స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్న జనాలు
- సంసారాల్లో చిచ్చు పెడుతున్న స్మార్ట్ ఫోన్
- తాజాగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఘటన
- భర్యపై ఆగ్రహానికి గురై రెండో ఫ్లోర్ నుంచి తోసేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి . వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తపై భార్య.. భార్యపై భర్త.. అనుమానాలు పెంచుకుంటున్నారు. కొందరైతే చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో వెలుగులోకి వచ్చింది. తన భార్య మొబైల్ ఫోన్ అధికంగా వాడిందన్న కారణంతో భర్త ఆమెను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా.. డీకేఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. వికాస్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
READ MORE: UP: స్నేహితురాలి బర్త్డే సెలబ్రేషన్లో క్లాస్మేట్స్ దుశ్చర్య.. దళిత టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
సునీల్ అనే వ్యక్తి రాజధాని రాయ్పూర్లోని వికాస్ నగర్లో నివాసం ఉంటున్నాడు. పని నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. తన భార్యను అన్నం పెట్టమని అడిగాడు. ఆమె పట్టించుకోకుండా మొబైల్ని చూస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే అలసి పోయిన సునీల్ ఆగ్రహం పెంచుకున్నాడు. భార్యను ఇంట్లో నుంచి రెండో అంతస్తు బాల్కనీలోకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కిందకు తోసేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులతో పాటు అంబులెన్స్కు సమాచారం అందించారు. మహిళను డీకేఎస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హత్యాయత్నం సెక్షన్ల కింద భర్తపై గుధియారి పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: PM Modi: జనవరి 8న ఏపీకి ప్రధాని.. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ఏడేళ్ల బుడతడు.. ఫోన్ లేకుండా క్షణం ఉండలేకపోతున్నాడు. ఫోన్ లాక్కుంటే బూతులు తిడుతున్నాడు. ఫోన్ ఇచ్చేదాక నానా హంగామా చేస్తున్నాడు. తలను గోడకు బాదుకోవడం, తండ్రిని కొట్టడం, బిల్డింగ్పై నుంచి దూకుతానని బెదిరించడం వంటి వయసుకు మించిన చేష్టలను చూసి తండ్రికి భయం పట్టుకుంటుంది. ఇది పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా దర్శనమిస్తోంది.
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!