Woman Sold Her Child : భర్త అప్పు తీర్చేందుకు నెల రోజుల బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎక్కడంటే?
- అప్పులు తీర్చేందుకు బిడ్డను అమ్మిన తల్లి
- మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
- కర్ణాటకలోని రామ్ నగర్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని రామ్ నగర్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నవజాత శిశువును విక్రయించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 40 ఏళ్ల మహిళ తన 30 రోజుల నవజాత శిశువును రూ. 1.5 లక్షలకు విక్రయించింది. తన కొడుకు కనిపించడం లేదని, భార్యపై అనుమానం ఉందని మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భర్త అప్పు తీర్చేందుకే బిడ్డను భార్య అమ్మేసిందని చెబుతున్నారు.
READ MORE: Mohan Babu : పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేసిన మోహన్ బాబు
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పటికే ఈ దంపతులు రూ.3 లక్షలకు పైగా అప్పులు చేశారు. ఎలాగైన అప్పులు తీర్చాలని ఆ భార్య తన బిడ్డను బెంగళూరుకు చెందిన మరో మహిళకు విక్రయించింది. భర్త కథనం ప్రకారం.. డిసెంబరు 5న సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి బాబు కనిపించకుండా పోయాడు. శిశువుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, బంధువుతో పాటు వైద్యుని వద్దకు పంపించినట్లు భార్య తెలియజేసింది. ఇది నమ్మి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి బాబు జాడ కనిపించలేదు.
READ MORE:Manchu Family: మనోజ్- మోహన్ బాబు గొడవలో వెలుగులోకి ఆసక్తికర అంశాలు
భార్య మునుపటిలా అదే వివరణ ఇచ్చింది. దీంతో భర్తకు అనుమానం పెరిగింది. డాక్టర్ లేదా బంధువు కాంటాక్ట్ నంబర్ అడగగా, ఆమె ఇవ్వడానికి నిరాకరించింది. వారి మధ్య వాగ్వాదం జరిగి భర్త తలపై గాయమైంది. డిసెంబర్ 7న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు బృందం ఆమెను విచారించగా, బిడ్డ తన బంధువు వద్ద ఉందని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఆమె బిడ్డను రూ. 1.5 లక్షలకు విక్రయించినట్లు అంగీకరించింది. పోలీసులు వెంటనే బెంగళూరు వెళ్లి చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారిని రక్షించి మండ్యలోని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కు తరలించి.. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!