Woman Sold Her Child : భర్త అప్పు తీర్చేందుకు నెల రోజుల బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎక్కడంటే?
- అప్పులు తీర్చేందుకు బిడ్డను అమ్మిన తల్లి
- మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
- కర్ణాటకలోని రామ్ నగర్లో ఘటన
కర్ణాటకలోని రామ్ నగర్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నవజాత శిశువును విక్రయించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 40 ఏళ్ల మహిళ తన 30 రోజుల నవజాత శిశువును రూ. 1.5 లక్షలకు విక్రయించింది. తన కొడుకు కనిపించడం లేదని, భార్యపై అనుమానం ఉందని మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భర్త అప్పు తీర్చేందుకే బిడ్డను భార్య అమ్మేసిందని చెబుతున్నారు.
READ MORE: Mohan Babu : పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేసిన మోహన్ బాబు
Also Read
- Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పటికే ఈ దంపతులు రూ.3 లక్షలకు పైగా అప్పులు చేశారు. ఎలాగైన అప్పులు తీర్చాలని ఆ భార్య తన బిడ్డను బెంగళూరుకు చెందిన మరో మహిళకు విక్రయించింది. భర్త కథనం ప్రకారం.. డిసెంబరు 5న సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి బాబు కనిపించకుండా పోయాడు. శిశువుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, బంధువుతో పాటు వైద్యుని వద్దకు పంపించినట్లు భార్య తెలియజేసింది. ఇది నమ్మి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి బాబు జాడ కనిపించలేదు.
READ MORE:Manchu Family: మనోజ్- మోహన్ బాబు గొడవలో వెలుగులోకి ఆసక్తికర అంశాలు
భార్య మునుపటిలా అదే వివరణ ఇచ్చింది. దీంతో భర్తకు అనుమానం పెరిగింది. డాక్టర్ లేదా బంధువు కాంటాక్ట్ నంబర్ అడగగా, ఆమె ఇవ్వడానికి నిరాకరించింది. వారి మధ్య వాగ్వాదం జరిగి భర్త తలపై గాయమైంది. డిసెంబర్ 7న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు బృందం ఆమెను విచారించగా, బిడ్డ తన బంధువు వద్ద ఉందని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఆమె బిడ్డను రూ. 1.5 లక్షలకు విక్రయించినట్లు అంగీకరించింది. పోలీసులు వెంటనే బెంగళూరు వెళ్లి చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారిని రక్షించి మండ్యలోని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కు తరలించి.. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!