Woman Sold Her Child : భర్త అప్పు తీర్చేందుకు నెల రోజుల బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎక్కడంటే?
- అప్పులు తీర్చేందుకు బిడ్డను అమ్మిన తల్లి
- మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
- కర్ణాటకలోని రామ్ నగర్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని రామ్ నగర్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నవజాత శిశువును విక్రయించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 40 ఏళ్ల మహిళ తన 30 రోజుల నవజాత శిశువును రూ. 1.5 లక్షలకు విక్రయించింది. తన కొడుకు కనిపించడం లేదని, భార్యపై అనుమానం ఉందని మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భర్త అప్పు తీర్చేందుకే బిడ్డను భార్య అమ్మేసిందని చెబుతున్నారు.
READ MORE: Mohan Babu : పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేసిన మోహన్ బాబు
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పటికే ఈ దంపతులు రూ.3 లక్షలకు పైగా అప్పులు చేశారు. ఎలాగైన అప్పులు తీర్చాలని ఆ భార్య తన బిడ్డను బెంగళూరుకు చెందిన మరో మహిళకు విక్రయించింది. భర్త కథనం ప్రకారం.. డిసెంబరు 5న సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి బాబు కనిపించకుండా పోయాడు. శిశువుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, బంధువుతో పాటు వైద్యుని వద్దకు పంపించినట్లు భార్య తెలియజేసింది. ఇది నమ్మి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి బాబు జాడ కనిపించలేదు.
READ MORE:Manchu Family: మనోజ్- మోహన్ బాబు గొడవలో వెలుగులోకి ఆసక్తికర అంశాలు
భార్య మునుపటిలా అదే వివరణ ఇచ్చింది. దీంతో భర్తకు అనుమానం పెరిగింది. డాక్టర్ లేదా బంధువు కాంటాక్ట్ నంబర్ అడగగా, ఆమె ఇవ్వడానికి నిరాకరించింది. వారి మధ్య వాగ్వాదం జరిగి భర్త తలపై గాయమైంది. డిసెంబర్ 7న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు బృందం ఆమెను విచారించగా, బిడ్డ తన బంధువు వద్ద ఉందని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఆమె బిడ్డను రూ. 1.5 లక్షలకు విక్రయించినట్లు అంగీకరించింది. పోలీసులు వెంటనే బెంగళూరు వెళ్లి చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారిని రక్షించి మండ్యలోని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కు తరలించి.. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!