Crime News: వైఫ్ కాదు నైఫ్.. కట్టుకున్నోడిని కాటికి పంపిన భార్య!
- వైఫ్ కాదు నైఫ్
- ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసిన భార్య
- కట్టుకున్నోడిని కాటికి పంపిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం ఉత్తరపల్లిలో యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిన్న దారుణ హత్యకు గురైన రాజు (35) హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. భర్తని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. విచారణలో ఏమీ తెలియనట్టు అమాయకత్వం ప్రదర్శించిన భార్య సుమలతను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం… సుమలత 12 ఏళ్ల క్రితం రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుమలతపై ప్రేమతో రాజు తన ఛాతీ ఎడమ వైపు లత అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. రాజు, సుమలతకి ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ కుటుంబ సభ్యులకు దూరంగా వచ్చి జీవిస్తున్నారు. మల్లెపల్లిలోని ఓ బీర్ ఫ్యాక్టరీ క్యాంటీన్లో భార్యాభర్తలు పని చేస్తున్నారు. క్యాంటీన్లో వంట మాస్టర్తో సుమలత ప్రేమలో పడింది. మాస్టర్ మాయలో పడిన సుమలత భర్తని పక్కకుపెట్టింది. దాంతో గత కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మాస్టర్తో ప్రేమ మత్తులో ఉన్న సుమలత.. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించేందుకు పథకం పన్నింది. సుమలత ప్రియుడు మందు తాగుదామని రాజును పిలిచాడు. రాజు పూటుగా మద్యం సేవించాక.. అతడిని హత్య చేశాడు. అనంతరం తన భర్త హత్యకు గురయ్యాడని నాటకం ఆడింది. భర్తని హత్య చేసి ఏమి తెలియనట్టు సతి సావిత్రిలా నటించింది. విచారణలో పోలీసులు అసలు సినిమా చూపించడంతో అసలు స్టోరీ చెప్పింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!