UP: దారుణం.. భర్తను కొట్టి ఇంట్లో నుంచి గెంటేసిన భార్య.. ఎందుకంటే?
- భర్తను కొట్టిన భార్య
- ఇంటిని తన పేరుపై రాసుకుని గెంటేసిన వైనం
- యూపీలోని అమ్రోహా జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగవాళ్లు ఆడవాళ్లను వేధించడం, వాళ్ల ఇళ్లల్లోంచి వెళ్లగొట్టడం లాంటి ఉదంతాలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ యూపీలోని అమ్రోహా జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్య భర్తను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ మహిళ యూపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్. తన భార్య తనను కొట్టిందని.. జైలుకు పంపుతానని బెదిరించిందని బాధితుడైన భర్త ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
READ MORE: Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు!
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
నౌగవాన్ సాదత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి అదే ప్రాంతంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న మహిళా కానిస్టేబుల్తో వివాహమైంది. లేడీ కానిస్టేబుల్ ప్రస్తుతం బరేలీ జిల్లాలో విధులు నిర్వహిస్తోంది. వారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కుమార్తె భార్యతో మరొకరు భర్తతో ఉంటున్నారు. ఆ మహిళ తన భర్తపై ఒత్తిడి తెచ్చి మొదట మొరాదాబాద్లోని బుద్ధి బీహార్ కాలనీలో ఇల్లు కట్టించుకుంది. ఇంటి నిర్మాణం తర్వాత మహిళా కానిస్టేబుల్ తీరు మారింది. గ్రామంలోని భూమిని విక్రయించాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి అతడు నిరాకరించడంతో ఇంటిని తన పేరు మీదకు మార్చుకుని భర్తను ఇంటి నుంచి గెంటేసింది.
READ MORE:Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన.. షెడ్యూల్ వివరాలు..
డిసెంబర్ 5న ఇంటికి చేరుకున్న మహిళా కానిస్టేబుల్ తన భర్తను కొట్టి, ఫేక్ కేసు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించినట్లు ఆరోపించాడు. ఈ ఘటన ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు చూపించిన యువకుడు తన భార్యపై ఫిర్యాదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకునే ముందు విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!