దేశంలో ఒకవైపు భారీ వర్షాలు.. మరోవైపు భగ్గుమంటున్నా కూరగాయల ధరలతో జనాలు బేంబెలెత్తిపోతున్నారు.. ముఖ్యంగా టమాటా ధర తగ్గుముఖం పడుతుందేమో అని ఆశతో ఎదురుచూస్తున్న వినియోగ దారులకు షాక్ ఇస్తూ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. సామాన్య ప్రజలకు టమోటా అందని ద్రాక్షల మారుతుంది.. టమోటా కూర అనే పదాన్ని కూడా తియ్యడం లేదు.. ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో రానున్న రోజుల్లో టమాటా ధర మండిపోనుంది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలకు హిమాచల్ నుంచి…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి.. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి…
హిమాచల్ ప్రదేశ్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మధ్యంతర సహాయంగా కేంద్రం నుండి రూ. 2,000 కోట్లు కోరారు.
Himachal Pradesh: ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారతదేశం వణికిపోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నీటితో నిండిపోయాయి. వరదలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయింది.
Train Cancellations: భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జూలై 7 - జూలై 15 మధ్య దేశవ్యాప్తంగా 300 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు, 406 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి.
వానలు వచ్చాయ్.. వరదలు వచ్చాయ్.. ఊరువాడా నీటిలో మునిగే.. ఇది ఇప్పుడు దేశ పరిస్థితి.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో దేశం మొత్తం నిండు కుండలా ఉంది..ఇక గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని రాష్ట్రాల్లో వరదలు ముంచేత్తుతున్నాయి.. ఎప్పుడు ప్రాణాలు హరి అంటాయా అని జనం భయంతో కంటి మీద కునుకు లేకుండా ఉండారు..కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.. వరదల్లో రాలేక బంధువులు వీడియో కాల్ లో…
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది విలవిల్లాడుతోంది. కొండలు, కోనలు దొర్లిపడుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి..లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వరద ముప్పు ఏర్పడింది. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు వరద ఉధృతితో అడ్డొచ్చినవాటిని కొట్టుకుంటూ పోతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి.…
కులు ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో వధూవరులు కులులో పెళ్లి మండపానికి వెళ్లలేకపోయారు. దీంతో ఆన్లైన్లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశిష్, శివానీల మ్యారేజ్ జరిపించారు. ఈ ఆన్లైన్ పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కూడా హాజరయ్యారు.
ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు, వరద సంబంధిత సంఘటనలలో 100 మందికి పైగా మరణించారు. గత వారం వర్షం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లోనే దాదాపు 80 మంది మరణించారు.