Landslides: ఆలయంపై కొండ చరియలు పడటంతో 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Landslides: ఇండియాలో ఈ మధ్య కాలంలో నైరుతిరుతుపవనాల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. భారీ వర్షాలతోపాటు వరదలు సైతం ఈ రాష్ట్రాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. మహారాష్ట్ర, ఢిల్లీతోపాటు, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు, వరదలు తమ ప్రతాపాన్ని చూపాయి. సోమవారం హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పక్కనే ఉన్న ఆలయంపై పడ్డాయి. దీంతో దేవాలయానికి వచ్చిన వారిలో సుమారు 9 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
Read also
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
ఎడతెరపి లేకుండా కురుస్తు్న్న భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి పలు చోట్ల ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం శిమ్లా లోని ఓ ఆలయం పై కొండచరియలు విరిగిపడి 9 మంది మృతిచెందారు. సోమవారం ఉదయం సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల ధాటికి ఆలయం కుప్పకూలింది. శిథిలాల కింద పదుల సంఖ్యలో భక్తులు చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు చెబుతున్నారు. నేడు శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయం వద్ద దాదాపు 50 మంది వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆలయంపై కొండి చరియలు పడిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించి ప్రజలను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వర్ష పరిస్థితుల దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాలు, కొండల ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలను సీఎం సూచించారు.
Read also:
పలు ప్రాంతాల్లోనూ వర్ష సంబంధిత ఘటనల్లో మరణాలు సంభవించాయి. హిమాచల్లో 24 గంటల వ్యవధిలోనే 21 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి సఖ్వీందర్ సింగ్ తెలిపారు. ఆదివారం సోలన్ జిల్లాలోని జాదోన్ గ్రామంలో కురిసిన కుంభవృష్టికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో శిమ్లాలో 131.6 మి.మీల వర్షపాతం నమోదైంది. నేడు, రేపు కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, కొండచరియల కారణంగా దాదాపు 750 రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7,020.28 కోట్ల నష్టం వాటిల్లింది. వర్ష సంబంధిత ఘటనల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!