PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి కూడా దీపావళి వేడుకలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన సైన్యం దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరి దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
PM Modi Celebrate Diwali 2023 with Indian Security Forces: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించిన ప్రధాని.. సైనికులతో కలిసి అక్కడ వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోలను ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. మిలిటరీ దుస్తులు ధరించిన ప్రధాని.. సైనికులతో ముచ్చటిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ధైర్యవంతమైన భారత…
Cryptocurrency Fraud: క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించిన పెద్ద కేసు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మోసం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, హమీర్పూర్లోని మోసగాళ్లు క్రిప్టోకరెన్సీ చైన్ను ఉపయోగించి 2018 నుండి ఐదేళ్ల కాలంలో వేల మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్లకు పైగా మోసం చేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం కులు, మండిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల బాధితులను పరామర్శించి వారితో కలిసి బాధలను పంచుకున్నారు.
దేశంలో సుందరమైన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చిన భారీ వర్షాలతో రాష్ట్రం అతలా కుతలంగా మారింది. రాష్ట్రం సర్వనాశనవం అయింది.
సుందరమైన హిమాచల్ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో బీతావహంగా మారిపోతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం వేల కోట్ల నష్టపోయింది.
కులులో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు కూలిపోయాయి. దీంతో కూలిపోయిన భవనాలు, ఇళ్ల శిథిలాల మధ్య పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కొండచరియల ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
నైరుతు రుతుపవనాలు ప్రారంభం అయినప్పటి నుంచీ హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు వరదల నుంచి కోలుకోలేదు.
వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్ప్రదేశ్కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది.