Himachal Pradesh: విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు పోలీసులు సహా 7 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: శుక్రవారం చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం సియుల్ నదిలో పడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. 11 మందితో కూడిన వాహనం బైరాగఢ్ నుంచి తిస్సాకు వెళ్తుండగా.. చంబా జిల్లాలోని చురా ప్రాంతంలోని తర్వాయి వంతెన సమీపంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఒక పెద్ద బండరాయి వాహనం పై పడిందని, దాని కారణంగా అది వాహనం నదిలోకి పడిపోయిందని పోలీసులు వెల్లడించారు.
Also Read: Medicine: మందులు కావాలి బాబోయ్ అంటున్న పాకిస్తాన్.. పెద్ద మనసు చేసుకున్న భారత్
Also Read
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
- Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
బాధితుల్లో చంబా బోర్డర్లో నియమించబడిన 2వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్కు చెందిన ఆరుగురు పోలీసులు ఉన్నారు. వీరిని రాకేష్ గోరా, ప్రవీణ్ టోండన్, కమల్జీత్, సచిన్, అభిషేక్, లక్షయ్ కుమార్లుగా గుర్తించగా, ఏడవ బాధితుడు చంద్రు రామ్ స్థానికంగా నివాసముంటున్నాడని వారు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఒక పౌరుడితో పాటు ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని, గాయపడిన వ్యక్తులకు ఉత్తమ చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
Also Read: Men Thrash Father: పిల్లాడు ఏడుస్తున్నా కనికరించ లేదు.. కర్రలతో దారుణంగా కొట్టారు
ఇదిలావుండగా, చురాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్ మాట్లాడుతూ.. ప్రయాణం సురక్షితంగా లేనందున తాము చాలా కష్టపడి ఈ రహదారిని మూసివేసామని, అయితే ఈ ప్రాంతంలో పునరావృతమయ్యే కొండచరియల గురించి సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ రహదారిని తెరిచిందని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా హన్స్రాజ్.. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేశారు. పీడబ్ల్యూడీ అధికారి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న పీడబ్ల్యూడీ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి ఆగస్టు 10 వరకు, వర్షాలకు సంబంధించిన సంఘటనలు, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 234 కి చేరుకుంది. ఇందులో 83 కొండచరియలు విరిగిపడటంతో 39 మంది మరణించారు. 97 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆగస్టు 12 మరియు 13 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. ఆగస్టు 17 వరకు రాష్ట్రంలో జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, బురదజల్లులు, నదులు, కాలువలలో నీటి ప్రవాహం పెరుగుతుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!