Himachal Pradesh: విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు పోలీసులు సహా 7 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: శుక్రవారం చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం సియుల్ నదిలో పడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. 11 మందితో కూడిన వాహనం బైరాగఢ్ నుంచి తిస్సాకు వెళ్తుండగా.. చంబా జిల్లాలోని చురా ప్రాంతంలోని తర్వాయి వంతెన సమీపంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఒక పెద్ద బండరాయి వాహనం పై పడిందని, దాని కారణంగా అది వాహనం నదిలోకి పడిపోయిందని పోలీసులు వెల్లడించారు.
Also Read: Medicine: మందులు కావాలి బాబోయ్ అంటున్న పాకిస్తాన్.. పెద్ద మనసు చేసుకున్న భారత్
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
బాధితుల్లో చంబా బోర్డర్లో నియమించబడిన 2వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్కు చెందిన ఆరుగురు పోలీసులు ఉన్నారు. వీరిని రాకేష్ గోరా, ప్రవీణ్ టోండన్, కమల్జీత్, సచిన్, అభిషేక్, లక్షయ్ కుమార్లుగా గుర్తించగా, ఏడవ బాధితుడు చంద్రు రామ్ స్థానికంగా నివాసముంటున్నాడని వారు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఒక పౌరుడితో పాటు ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని, గాయపడిన వ్యక్తులకు ఉత్తమ చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
Also Read: Men Thrash Father: పిల్లాడు ఏడుస్తున్నా కనికరించ లేదు.. కర్రలతో దారుణంగా కొట్టారు
ఇదిలావుండగా, చురాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్ మాట్లాడుతూ.. ప్రయాణం సురక్షితంగా లేనందున తాము చాలా కష్టపడి ఈ రహదారిని మూసివేసామని, అయితే ఈ ప్రాంతంలో పునరావృతమయ్యే కొండచరియల గురించి సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ రహదారిని తెరిచిందని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా హన్స్రాజ్.. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేశారు. పీడబ్ల్యూడీ అధికారి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న పీడబ్ల్యూడీ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి ఆగస్టు 10 వరకు, వర్షాలకు సంబంధించిన సంఘటనలు, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 234 కి చేరుకుంది. ఇందులో 83 కొండచరియలు విరిగిపడటంతో 39 మంది మరణించారు. 97 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆగస్టు 12 మరియు 13 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. ఆగస్టు 17 వరకు రాష్ట్రంలో జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, బురదజల్లులు, నదులు, కాలువలలో నీటి ప్రవాహం పెరుగుతుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!