Khawaja Asif: ‘అమెరికా మనల్ని టాయిలెట్ పేపర్ కంటే హీనంగా వాడుకుంది’.. నిజం ఒప్పుకున్న పాక్ రక్షణ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khawaja Asif: అమెరికా గురించి ప్రపంచం మొత్తం తెలుసు. ఎప్పుడు ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తుందో.. దేశాన్ని ఎందుకు వాడుకుంటుందో బాధిత దేశం నష్టపోయే వరకు తెలియదు. ఈ అంశంపై పాకిస్థాన్ పార్లమెంట్లో రచ్చ చోటు చేసుకుంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాకిస్థాన్ను ఉపయోగించుకుందని, పని అయిపోయిన తర్వాత టాయిలెట్ పేపర్ కంటే హీనంగా విసిరేస్తుందని విమర్శించారు. ఆసిఫ్ మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది. 1980లలో సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ పాల్గొన్న తీరు గురించి ప్రశ్నించారు. అది మతపరమైన యుద్ధం కాదని, ఇస్లాం రక్షణ కోసం చేసింది కాదన్నారు. అమెరికా వ్యూహంలో భాగంగానే యుద్ధం కొనసాగిందని అంగీకరించారు. ఆ సమయంలో రష్యా ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా ఆక్రమించి, జిహాద్ ప్రకటించాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. అయినా పాకిస్థాన్ ఆ యుద్ధంలోకి దూకిందని తెలిపారు. ఆ నిర్ణయాల ప్రభావం ఇప్పటికీ దేశం అనుభవిస్తోందని ఎట్టకేలకు నిజం ఒప్పున్నారు. జిహాద్ పేరుతో యువకులను యుద్ధాలకు పంపడం పెద్ద తప్పిదమన్నారు. యుద్ధాన్ని సమర్థించేందుకు విద్యా పాఠ్యాంశాల్లో మార్పులు చేశారని, ఆ మార్పులను ఇప్పటికీ పూర్తిగా సరిచేయలేకపోతున్నామని తెలిపారు. అంటే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు సమాజంపై ఎంత లోతైన ప్రభావం చూపాయో మంత్రి మాటల్లో తెలుస్తోంది.
READ MORE: Toxic : ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ క్లోజ్.. కన్నడ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు!
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
1999 తర్వాత పరిస్థితి మరింత క్లిష్టమైందని ఆసిఫ్ చెప్పారు. అమెరికా మద్దతు పొందాలనే ఉద్దేశంతో మళ్లీ వాషింగ్టన్తో కలిసి నడిచామని, కానీ ఆ నిర్ణయం దేశానికి చాలా నష్టం తెచ్చిపెట్టిందని అన్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నేతృత్వంలో జరిగిన ‘వార్ ఆన్ టెరర్’లో పాకిస్థాన్ తాలిబాన్కు వ్యతిరేకంగా పోరాడింది. అయితే కొంతకాలం తర్వాత అమెరికా అక్కడి నుంచి వెళ్లిపోయిందని, కానీ ఆ యుద్ధం వల్ల వచ్చిన సమస్యలు మాత్రం పాకిస్థాన్ను ఇప్పటికీ వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. మాజీ సైనిక పాలకులు జియా ఉల్ హక్, పరవేజ్ ముషర్రఫ్లపై నేరుగా విమర్శలు చేశారు. దేశానికి సంబంధించినవి కాని యుద్ధాల్లో పాకిస్థాన్ను తోసేశారని ఆరోపించారు. ఇతరుల యుద్ధాల్లో పాకిస్థాన్ ఒక బొమ్మలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేం” అని ఆసిఫ్ అన్నారు. తీసుకున్న కొన్ని నిర్ణయాలు తిరిగి మార్చలేని తప్పిదాలుగా మిగిలిపోయాయని చెప్పారు. ఒకప్పుడు మిత్రత్వం పేరిట తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎంతటి భారం అయ్యాయో ఇప్పుడు స్పష్టమవుతోందని మంత్రి మాటల్లో కనిపించింది.
READ MORE: Canada: కెనడా స్కూల్లో ఘోరం.. విచక్షణారహితంగా కాల్పులు.. 10 మంది మృతి
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!