Himachal Pradesh : వరదలతో రూ.8 వేల కోట్ల మేర నష్టం: సీఎం సుఖ్విందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి.. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు వెల్లడించారు..
ఈ వరదలు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయని దాంతో కేంద్ర ప్రభుత్వం మాకు ఆర్థిక సాయం అందించాలని ఆయన తెలిపారు..2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విపత్తు నిధులు రూ.315 కోట్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశామన్నారు. వర్షాలు, వరదలతో రూ.8 వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనావేశామని స్పష్టం చేశారు.. కులు జిల్లాలోని కసోల్, మణికరణ్ మరియు ఇతర పరిసర ప్రాంతాలలో చిక్కుకున్న కొంతమంది పర్యాటకులు తమ వాహనాలు లేకుండా బయటకు వెళ్లడానికి నిరాకరించారు. పరిస్థితి సాధారణీకరించి, అన్ని రహదారులు తెరిచే వరకు వారంతా మరికొన్ని రోజులు వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు.కసోల్-భుంటార్ రహదారిపై దున్ఖారా సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో అనేక వాహనాలు కదలలేదు మరియు పర్యాటకులు అవతలి వైపుకు చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయవలసి వచ్చింది. అయితే, ఈ పర్యాటకులను జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
ఇకపోతే సాధ్యామైన త్వరగా రోడ్లు, విద్యుత్, నీటి సరఫరాను కొంతవరకు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత ఆపత్కాలంలో కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సన్నద్ధమై ఉందని చెప్పారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. విపత్తు వేళ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఇబ్బందులు ఆయనకు తమాషా గా ఉందని తీవ్రంగా మండిపడ్డారు..
తాజావార్తలు
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!