దళిత బందులో కూడా జర్నలిస్ట్ లకు అవకాశం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇండ్ల పట్టాలు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని పేర్కొన్నారు.
Telangana assembly session: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించనున్నారు.
భక్తి టీవీ కోటి దీపోత్సవం ఐదో రోజు అంగరంగ వైభవంగా సాగింది. అక్టోబర్ 31న ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదో రోజు కోటిదీపోత్సవం కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్రావు దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటి దీపోత్సవంలో భాగంగా ముందుగా శ్రీ స్మరణానంద గిరి స్వామీజీ ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం జరిగింది. అనంతర బ్రహ్మశ్రీ డా.మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనామృతం జరిగింది. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.…