మోటార్లు కావాలా? మీటర్లు కావాలా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవానలి మంత్రి హరీశ్ రావ్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నిక ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష అని అన్నారు. కోట్లు పెట్టి ప్రజలను కొనాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శలు గుప్పించారు. ఎక్కడో ఢిల్లీలోనో, హైదరాబాద్ గాంధీభవన్ లోనో కూర్చుని మాటలు మాట్లాడుతున్న నేతలకు తెలంగాణలో నీళ్లు అందుతున్నాయా? లేదా ? అనే విషయం వాళ్లకేం తెలుసని ప్రశ్నించారు.