Israel-Iran War: ‘‘ఆపరేషన్ సిందూర్’’ నుంచి యూఎస్, ఇజ్రాయిల్ పాఠాలు నేర్చుకున్నాయా.? ఇరాన్ యుద్ధంలో ఏం చేస్తున్నాయి..?
- ఇండియా స్ట్రాటజీ ఫాలో అవుతున్న ఇజ్రాయిల్, యూఎస్..
- ఆపరేషన్ సిందూర్లో కిరాణా హిల్స్ దాడి లాగే ఇరాన్పై అటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ వరసగా ఇరాన్పై దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్లపై కూడా దాడులు చేస్తోంది. ముఖ్యంగా, యూఎస్ బేస్లను టార్గెట్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో యూఎస్, ఇజ్రాయిల్ దళాలు ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ అనుసరించిన స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
కిరాణా హిల్స్ దాడే స్పూర్తి:
Also Read
- Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
- Benjamin Netanyahu: అమెరికా ఒప్పందం చేసుకున్నా తగ్గేదేలే.. ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్..
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తర్వాత, పాక్ సైన్యం దాడికి పాల్పడితే, భారత్ పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
అన్నింటికన్నా ముఖ్యమైన దాడి ‘‘కిరాణా హిల్స్’’గా చెప్పబడుతుంది. నిజానికి కిరాణా హిల్స్పై దాడి చేసినట్లు భారత్ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. కానీ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా అంతర్జాతీయ నిపుణులు దాడి వాస్తవమని చెబుతున్నారు. ఈ దాడి తర్వాతే, పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి, కాల్పులు విరమణ కోసం ప్రాధేయపడింది.
కిరాణా హిల్స్ పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెట్టే ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడి గుహాలో ఆయుధాలను నిల్వ చేస్తారు. భారత్ ఈ గుహకు ముఖద్వారాల వద్ద దాడులు చేసింది. దీంతో వ్యవస్థ మొత్తం నాశనమైంది. ఈ దాడి చాలా ఖచ్చితత్వంతో జరిగింది. భారత్ సురక్షితంగా ఎలాంటి రేడియేషన్ ముప్పు, అణు ముప్పు లేకుండా దాడి చేసింది.
ఇదే పనిచేస్తున్న యూఎస్, ఇజ్రాయిల్ :
ఇరాన్ యుద్ధంలో కూడా యూఎస్, ఇజ్రాయిల్ ఇదే స్ట్రాటజీని అవలంభిస్తున్నాయి. ఇరాన్ దశాబ్ధాలుగా భూగర్భంలో మిస్సైల్ సిటీలను నిర్మించింది. ఇందులోనే డ్రోన్లు, మిస్సైళ్లను దాచిపెడుతోంది. వీటిని దాడిన బంకర్లు చాలా బలంగా ఉన్నాయి. కానీ యూఎస్ ఇజ్రాయిల్ దళాలు వాటిని నాశనం చేయడానికి బదులుగా వాటి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద దాడులు చేస్తోంది. దీంతో లోపల ఉన్న మిస్సైల్స్, డ్రోన్లు, ఇతర ఆయుధాలు బయటకు తీసువచ్చే ఛాన్స్ లేకుండాపోయింది. ఒక నివేదిక ప్రకారం, ఇరాన్ మిస్సైల్ , డ్రోన్ దాడులు దాదాపుగా 80 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాన్ బీ-2, బీ-52 బాంబర్లు భారీగా బాంబులు వేస్తూ బంకర్లను మూసేశాయి.
తాజావార్తలు
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?