Israel-Iran War: ‘‘ఆపరేషన్ సిందూర్’’ నుంచి యూఎస్, ఇజ్రాయిల్ పాఠాలు నేర్చుకున్నాయా.? ఇరాన్ యుద్ధంలో ఏం చేస్తున్నాయి..?
- ఇండియా స్ట్రాటజీ ఫాలో అవుతున్న ఇజ్రాయిల్, యూఎస్..
- ఆపరేషన్ సిందూర్లో కిరాణా హిల్స్ దాడి లాగే ఇరాన్పై అటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ వరసగా ఇరాన్పై దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్లపై కూడా దాడులు చేస్తోంది. ముఖ్యంగా, యూఎస్ బేస్లను టార్గెట్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో యూఎస్, ఇజ్రాయిల్ దళాలు ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ అనుసరించిన స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
కిరాణా హిల్స్ దాడే స్పూర్తి:
Also Read
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Pakistan-China: జిన్పింగ్తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
- Trump-Pakistan: పాకిస్థాన్కు ఊహించని సిట్యుయేషన్.. ట్రంప్ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన పాక్..
- US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తర్వాత, పాక్ సైన్యం దాడికి పాల్పడితే, భారత్ పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
అన్నింటికన్నా ముఖ్యమైన దాడి ‘‘కిరాణా హిల్స్’’గా చెప్పబడుతుంది. నిజానికి కిరాణా హిల్స్పై దాడి చేసినట్లు భారత్ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. కానీ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా అంతర్జాతీయ నిపుణులు దాడి వాస్తవమని చెబుతున్నారు. ఈ దాడి తర్వాతే, పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి, కాల్పులు విరమణ కోసం ప్రాధేయపడింది.
కిరాణా హిల్స్ పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెట్టే ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడి గుహాలో ఆయుధాలను నిల్వ చేస్తారు. భారత్ ఈ గుహకు ముఖద్వారాల వద్ద దాడులు చేసింది. దీంతో వ్యవస్థ మొత్తం నాశనమైంది. ఈ దాడి చాలా ఖచ్చితత్వంతో జరిగింది. భారత్ సురక్షితంగా ఎలాంటి రేడియేషన్ ముప్పు, అణు ముప్పు లేకుండా దాడి చేసింది.
ఇదే పనిచేస్తున్న యూఎస్, ఇజ్రాయిల్ :
ఇరాన్ యుద్ధంలో కూడా యూఎస్, ఇజ్రాయిల్ ఇదే స్ట్రాటజీని అవలంభిస్తున్నాయి. ఇరాన్ దశాబ్ధాలుగా భూగర్భంలో మిస్సైల్ సిటీలను నిర్మించింది. ఇందులోనే డ్రోన్లు, మిస్సైళ్లను దాచిపెడుతోంది. వీటిని దాడిన బంకర్లు చాలా బలంగా ఉన్నాయి. కానీ యూఎస్ ఇజ్రాయిల్ దళాలు వాటిని నాశనం చేయడానికి బదులుగా వాటి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద దాడులు చేస్తోంది. దీంతో లోపల ఉన్న మిస్సైల్స్, డ్రోన్లు, ఇతర ఆయుధాలు బయటకు తీసువచ్చే ఛాన్స్ లేకుండాపోయింది. ఒక నివేదిక ప్రకారం, ఇరాన్ మిస్సైల్ , డ్రోన్ దాడులు దాదాపుగా 80 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాన్ బీ-2, బీ-52 బాంబర్లు భారీగా బాంబులు వేస్తూ బంకర్లను మూసేశాయి.
తాజావార్తలు
-
SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
-
US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
-
Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
-
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
-
Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!