Israel-Iran War: ‘‘ఆపరేషన్ సిందూర్’’ నుంచి యూఎస్, ఇజ్రాయిల్ పాఠాలు నేర్చుకున్నాయా.? ఇరాన్ యుద్ధంలో ఏం చేస్తున్నాయి..?
- ఇండియా స్ట్రాటజీ ఫాలో అవుతున్న ఇజ్రాయిల్, యూఎస్..
- ఆపరేషన్ సిందూర్లో కిరాణా హిల్స్ దాడి లాగే ఇరాన్పై అటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ వరసగా ఇరాన్పై దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్లపై కూడా దాడులు చేస్తోంది. ముఖ్యంగా, యూఎస్ బేస్లను టార్గెట్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో యూఎస్, ఇజ్రాయిల్ దళాలు ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ అనుసరించిన స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
కిరాణా హిల్స్ దాడే స్పూర్తి:
Also Read
- Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తర్వాత, పాక్ సైన్యం దాడికి పాల్పడితే, భారత్ పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
అన్నింటికన్నా ముఖ్యమైన దాడి ‘‘కిరాణా హిల్స్’’గా చెప్పబడుతుంది. నిజానికి కిరాణా హిల్స్పై దాడి చేసినట్లు భారత్ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. కానీ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా అంతర్జాతీయ నిపుణులు దాడి వాస్తవమని చెబుతున్నారు. ఈ దాడి తర్వాతే, పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి, కాల్పులు విరమణ కోసం ప్రాధేయపడింది.
కిరాణా హిల్స్ పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెట్టే ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడి గుహాలో ఆయుధాలను నిల్వ చేస్తారు. భారత్ ఈ గుహకు ముఖద్వారాల వద్ద దాడులు చేసింది. దీంతో వ్యవస్థ మొత్తం నాశనమైంది. ఈ దాడి చాలా ఖచ్చితత్వంతో జరిగింది. భారత్ సురక్షితంగా ఎలాంటి రేడియేషన్ ముప్పు, అణు ముప్పు లేకుండా దాడి చేసింది.
ఇదే పనిచేస్తున్న యూఎస్, ఇజ్రాయిల్ :
ఇరాన్ యుద్ధంలో కూడా యూఎస్, ఇజ్రాయిల్ ఇదే స్ట్రాటజీని అవలంభిస్తున్నాయి. ఇరాన్ దశాబ్ధాలుగా భూగర్భంలో మిస్సైల్ సిటీలను నిర్మించింది. ఇందులోనే డ్రోన్లు, మిస్సైళ్లను దాచిపెడుతోంది. వీటిని దాడిన బంకర్లు చాలా బలంగా ఉన్నాయి. కానీ యూఎస్ ఇజ్రాయిల్ దళాలు వాటిని నాశనం చేయడానికి బదులుగా వాటి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద దాడులు చేస్తోంది. దీంతో లోపల ఉన్న మిస్సైల్స్, డ్రోన్లు, ఇతర ఆయుధాలు బయటకు తీసువచ్చే ఛాన్స్ లేకుండాపోయింది. ఒక నివేదిక ప్రకారం, ఇరాన్ మిస్సైల్ , డ్రోన్ దాడులు దాదాపుగా 80 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాన్ బీ-2, బీ-52 బాంబర్లు భారీగా బాంబులు వేస్తూ బంకర్లను మూసేశాయి.
తాజావార్తలు
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!