Harish Rao: మోడీకి అమ్మడమే తెలుసు.. అభివృద్ధి చేయడం తెలీదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు బస్టాండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ,, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గాంధీ జయంతి రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని పటాన్ చెరులో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు. గాంధీజీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ కి దగ్గర పోలికలు ఉన్నాయి.
విదేశీ వద్దు….. స్వదేశీ ముద్దు అంటూ ఉద్యమంలో పాల్గొన్నారు.. స్వాతంత్ర్య సమరంలో, తర్వాత తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. లాయర్ గా చాకలి ఐలమ్మ భర్త కేసును రూపాయి తీసుకోకుండా వాదించారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిన మహొన్నత వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల ను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి అమ్మటమే తప్ప, అభివృద్ధి చేయడం తెలియదు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ని అధికారికంగా నిర్వహిస్తున్నాం అన్నారు. పద్మశాలి సమాజాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అన్నారు మంత్రి హరీష్ రావు.
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
Read Also: Adipurush Teaser: న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం..!!
గాంధీ గారికి గుడి కట్టించిన వ్యక్తి ఎమ్మెల్యే GMR. గాంధీ గారు లేకపోతే స్వేచ్ఛ వాయువులు పీల్చే వాళ్ళమా? దేశ స్వాతంత్రం కోసం తుదికంటా పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఇటీవల కొందరు గాంధీ గారిని కించ పరుస్తున్నారు. నేడు ప్రపంచమే గాంధీని ఆదర్శంగా తీసుకుంటోంది. ఎన్నో పోరాటాలు చేసి, ప్రజలకు ఒక్క తాటి పైకి తెచ్చిన వ్యక్తి గాంధీ. నేడు పటాన్ చెరుకే కళ వచ్చింది. అద్భుతమైన జంక్షన్ గా మార్చడం అభినందనీయం.
కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించిన పోలీస్, వైద్యులు, సఫాయి కార్మికులు విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రo కేంద్రం నుండి అవార్డ్స్ సాధిస్తుంది. మిషన్ భగీరథ కు నీతి ఆయోగ్ నిధులు ఇవ్వమన్న కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణకు మిషన్ భగీరథ పథకానికి అవార్డు వచ్చిన సంకుచితంగా వ్యవహరిస్తున్నారు.తెలంగాణకు అవార్డులు వస్తున్నాయని కేంద్రం అవార్డ్స్ బంద్ చేస్తుంది కావచ్చు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డం కాదు, నిలువు కాదు అన్న వాళ్ళు…ఇప్పుడు రాజకీయలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు… నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
సఫాయి అన్న మీకు సలం అన్న అని సీఎం కేసిఆర్ గారు ప్రశంసించారు. బుల్ తరహాలో పటాన్ చెరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. అందుకే బుల్ విగ్రహం పెట్టాం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతున్నాం అన్నారు.
Read ALso: Pope Francis: ఇంకెంత రక్తపాతం జరగాలి.. దయచేసి పుతిన్, జెలన్ స్కీలు యుద్ధాన్ని ఆపాలి
తాజావార్తలు
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
-
T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!