TRS V/s BJP: మెదక్ లో టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ ఫ్లెక్సీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS, BJP pota contest flexes in Medak: మెదక్ రైల్వేస్టేషన్ నుంచి కాచిగూడ వరకు రైలు పరుగులు పెట్టనుంది. ఈనేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు జెండా ఊపి ఈ ప్యాసింజర్ రైలును ప్రారంభించనున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్ హాజరుకానున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు హాజరు కానున్న నేపథ్యంలో.. పోటీపోటీగా ఫ్లె్క్సీలు ఏర్పాటు చేశారు ఇరువర్గాల శ్రేణులు. మెదక్ కి రానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానిస్తూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాగా.. మెదక్ కి ట్రైన్ తెచ్చిన సీఎం కి కృతజ్ఞతలు అంటూ TRS ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఈ ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఫోటోలతో పెద్ద ఎత్తున ప్లెక్సీలు TRS నేతలు ఏర్పాటు చేసారు. దీంతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏంజరగనుందో అంటూ సర్వత్రా ఉత్కంఠంగా మారనుంది. అయితే పోలీసులు అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మెదక్కు రైలు మార్గం కోసం 2003లో రైల్వే సాధన సమితి పేరిట స్థానిక ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు. కాగా.. ఈ క్రమంలో 2012-13 రైల్వే బడ్జెల్లో కాస్ట్ షేరింగ్ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ వరకు బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ మంజూరైంది. అనంతరం కేంద్ర ప్రభుత్వ వాటా నిధులన్నీ మంజూరవగా, రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెండింగ్లో ఉండడంతో పనులు నత్తనడకన సాగాయి. గత డిసెంబరులో రూ.20 కోట్లు మంజూరవడంతో ఆ మేరకు పనులు జరిగాయి. మెదక్ రైల్వే స్టేషన్ను ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. అంతేకాకుండా.. ఈ స్టేషన్ నుంచి నిత్యం తెల్లవారుజామున 5 గంటలకు కాచిగూడ ప్యాసింజర్ రైలు బయలుదేరుతుంది. నేడు మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభం సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రజలంతా ఉదయం 11 గంటలకు విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని రైల్వే సాధన సమితి ఓ ప్రకటనలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Kakani Govardhan Reddy : చంద్రబాబుకి సిగ్గు, శరం వంటివి ఏమీ లేవు
Also Read
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!