CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు
- 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు
- లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నాం
- శాంతియుత మార్గాలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది
- ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని పోరాటం చేస్తున్న కీలక నేతలు సైతం ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోవడం రాష్ట్రంలో శాంతి స్థాపనకు కొత్త ఊపిరి పోసింది. ప్లాటూన్-1, TSC, DK SZC, 2nd CRC వంటి ప్రధాన విభాగాలకు చెందిన ఈ మావోయిస్టుల లొంగుబాటు వెనుక పోలీసు ఉన్నతాధికారుల దీర్ఘకాలిక శ్రమ, ప్రభుత్వ పునరావాస విధానాలపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది.
Interest Rates Cut: ఆ బ్యాంక్లో లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు..
Also Read
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
- OTR : ఆ ఒక్క మాటతో సీన్ మొత్తం మారిపోయిందా? తాతా.. ఏం పని చేశావ్.!
ఈ భారీ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు మొత్తం 124 అత్యాధునిక తుపాకులను వారు పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక INSAS LMG రైఫిల్తో పాటు, 31 AK-47లు, 21 INSAS రైఫిళ్లు, 20 SLR రైఫిళ్లు, , 18 .303 రైఫిళ్లు ఉన్నాయి. వీటితో పాటు 5,205 తూటాలు, 9mm పిస్టల్స్ , ఇతర పేలుడు పదార్థాలను కూడా వారు సమర్పించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మావోయిస్టుల లొంగుబాటును సాదరంగా ఆహ్వానించారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. లొంగిపోయిన వారందరి ఆర్థిక , ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుందని, సొంత గ్రామాల్లో వారు స్థిరపడటానికి ఇళ్ల నిర్మాణంతో పాటు తగిన ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు, ముఖ్యంగా కీలక నేత గణపతి వంటి వారు కూడా బయటకు రావాలని, ఆయన ప్రాణాలకు , ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని సీఎం ఒక బహిరంగ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు ఆయుధాలతో లొంగిపోయే వారికి అత్యుత్తమ పునరావాసం కల్పిస్తామని, ప్రజాస్వామ్య పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
ట్రెండింగ్
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..