CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు
- 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు
- లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నాం
- శాంతియుత మార్గాలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది
- ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని పోరాటం చేస్తున్న కీలక నేతలు సైతం ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోవడం రాష్ట్రంలో శాంతి స్థాపనకు కొత్త ఊపిరి పోసింది. ప్లాటూన్-1, TSC, DK SZC, 2nd CRC వంటి ప్రధాన విభాగాలకు చెందిన ఈ మావోయిస్టుల లొంగుబాటు వెనుక పోలీసు ఉన్నతాధికారుల దీర్ఘకాలిక శ్రమ, ప్రభుత్వ పునరావాస విధానాలపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది.
Interest Rates Cut: ఆ బ్యాంక్లో లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు..
Also Read
- Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
ఈ భారీ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు మొత్తం 124 అత్యాధునిక తుపాకులను వారు పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక INSAS LMG రైఫిల్తో పాటు, 31 AK-47లు, 21 INSAS రైఫిళ్లు, 20 SLR రైఫిళ్లు, , 18 .303 రైఫిళ్లు ఉన్నాయి. వీటితో పాటు 5,205 తూటాలు, 9mm పిస్టల్స్ , ఇతర పేలుడు పదార్థాలను కూడా వారు సమర్పించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మావోయిస్టుల లొంగుబాటును సాదరంగా ఆహ్వానించారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. లొంగిపోయిన వారందరి ఆర్థిక , ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుందని, సొంత గ్రామాల్లో వారు స్థిరపడటానికి ఇళ్ల నిర్మాణంతో పాటు తగిన ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు, ముఖ్యంగా కీలక నేత గణపతి వంటి వారు కూడా బయటకు రావాలని, ఆయన ప్రాణాలకు , ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని సీఎం ఒక బహిరంగ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు ఆయుధాలతో లొంగిపోయే వారికి అత్యుత్తమ పునరావాసం కల్పిస్తామని, ప్రజాస్వామ్య పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
-
Kara Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ హీస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్… ఐయండిబిలో 8.2 రేటింగ్
-
Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!