రాస్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. నార్మర్ డెలవరీలను ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు. నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3000 పారితోషకం ప్రకటించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం అని సూచించారు. సిజేరియన్లను ప్రోత్సహించ వద్దని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని అన్నారు. నార్మల్ డెలివరీలు ఎక్కువగా పెరగాలని.. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రికి తేడా…
నారాయణపేట జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల జిల్లా…
ఆదివారం సాయంత్రం పటాన్చెరువులో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. రూ. 8.30 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. రూ. 3.40 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ బిల్డింగ్తో పాటు రూ. 3.85 కోట్లతో ఆధునీకరించిన మైత్రి క్రీడా మైదానాన్ని.. అలాగే రూ. 1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏడున్నర కోట్లతో పటాన్చెరువు స్టేడియం నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా…
తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం vs బీజేపీ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే! కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. అసలు కేంద్రం రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు వారి వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. డప్పు కొట్టుకోవడం తప్పిస్తే, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని టీఆర్ఎస్ తిప్పికొడుతోంది. కానీ, బీజేపీ నేతలు…
దవాఖానలో చికిత్స పొందుతున్న బాలింతలు తమ చిన్నారులకు ప్రైవేట్ మందులను వాడటాన్ని గమనించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సీరియస్ అయ్యారు. నగరంలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానను హరీశ్ రావ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానకు వస్తూనే నేరుగా వార్డులన్నీ కలియతిరిగారు. దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై రోగులు, వారి సహాయకులతో ఆరాతీశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వైద్య సేవలను అందిస్తుంటే పేద రోగులకు ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి మందులు తీసుకువచ్చేందుకు ఎందుకు రాస్తున్నారని…
కొందరు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఐటీ మంత్రి చైనాను పొగుతున్నారని.. అక్కడ ఉన్నది మిలిటరీ రూల్ అని తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి గురించి ఇక్కడ మాట్లాడినట్లు అక్కడ మాట్లాడితే ఊరుకోరని అన్నారు. కరోనాతో చనిపోయిన వారి లెక్కలు కూడా చైనా చెప్పదని.. చైనా ప్రభుత్వం చెప్పిందే రాసుకోవాలని తెలిపారు. కేటీఆర్ గొప్పగా చెబుతున్న చైనాలో ముస్లింలను చంపుతున్నారని.. అక్కడి ప్రభుత్వానికి…
కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ లేకుండా అసలు అవార్డులే లేవని. కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద దేశంలో 20 గ్రామాలు ప్రకటిస్తే తెలంగాణలోని 19 గ్రామాలకు అవార్డులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ బండి సంజయ్ తొండి సంజయ్ అని.. రేవంత్ రెడ్డిది గోబెల్స్ ప్రచారం అని విమర్శించారు. బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత చత్తీస్ గఢ్ లో అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బిల్లులు ఇవ్వలేదని…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలోని రెడ్డి భవన్ లో గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేకనే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రూ. 4 వేల కోట్లు జీఎస్టీ కింద రావాలని.. 15 వ ఆర్థిక సంఘం రూ. 6…
తెలంగాణ పంటలపై కీలక కామెంట్లు చేశారు మంత్రి హరీష్ రావు. ఇదే విధంగ మోటర్లకు మీటర్లు పెట్టాలనుకున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 5 ఏళ్లలో అత్యధికి పంటలు పండించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఆకలి చావులు, కాలిపోయే మోటార్లు, గుక్కెడు నీళ్లు లేకుపోయేవని ఆయన అన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంట్, పుష్కలమైన నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. రైతు బీమా పథకంల దేశంలో ఏ రాష్ట్రం కూడా…
ఆపదలోనైనా ప్రజలకు మేమున్నామంటూ చేదోడుగా నిలిచి, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా, సాహిత్యం అవార్డుల ప్రధానోత్సవ సమావేశం జరిగింది. ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి…