Botsa Satyanarayana: రైతుల పాదయాత్రపై ఫైర్.. ఎందుకు సహకరించాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Comments On Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల పాదయాత్ర మీద ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రైతుల ముసుగులో టీడీపీ, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు కలిసి.. ఈ అమరావతి పాదయాత్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అసలేం ఉద్ధరించడానికి వాళ్లు పాదయాత్ర చేస్తున్నారు? వారికి మేం ఎందుకు సహకరించాలి? అని ప్రశ్నించారు. అమరావతి భూముల్లో టీడీపీ నాయకులు దోచుకున్నారని, వాళ్లు ఎంత దోచుకున్నారో కూడా శాసనసభ సాక్షిగా తాము వెల్లడించామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఇదే సమయంలో.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమన్నారు. ఏపీలో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్ఎస్ కూడా ఒక పార్టీ అవుతుందే తప్ప, ఆ పార్టీ ప్రభావం తమపై ఏమాత్రం ఉండదని తేల్చి చెప్పారు. పోటీలో ఎంత ఎక్కువ మంది ఉంటే, అంతే మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
కాగా.. విజయనగరం మయూరీ కూడలి నుంచి వైఎస్ఆర్ జంక్షన్ వరకు అభివృద్ధి చేసిన రోడ్డు, సెంటర్ లైటింగ్, వాటర్ ఫౌంటెన్లపై బుధవారం రాత్రి చర్చించారు. అనంతరం ఎంపీ బెల్లం చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్లతో కలిసి రూ. 2.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్వహించారు. అంతకుముందు.. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి వచ్చి టీచర్లతో మాట్లాడాలని సూచించిన ఆయన.. తెలంగాణలో ఇస్తున్న పీఆర్సీని, ఏపీలో ఇస్తున్న పీఆర్సీతో పోల్చి చూడాలన్నారు. రెండు రాష్ట్రాల పీఆర్సీలను పక్కపక్కన పెట్టి చూస్తే.. అప్పులు అసలైన తేడా తెలుస్తుందన్నారు. అనవసరమైన వ్యాఖ్యలు ఎందుకని మంత్రి బొత్స నిప్పులు చెరిగారు.
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- OTR : ముద్రగడ తర్వాత ఆ ప్లేస్ అంబటిదేనా? కాపు పాలిటిక్స్లో రాంబాబు స్పీడ్
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?