సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ జనరేటర్ లో మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఫిలింనగర్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్ జనరేటర్ వాహనం నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వాహనంలో డీజిల్ లీక్ కావడంతో రోడ్డు పక్కన వున్న కారు, షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. షూటింగ్ వాహనానికి దగ్గరగా, రోడ్డు పక్కన ఆగివున్న హొండా ఐ20 కారు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. అయితే ఈ…
ఆఫ్రికాలోని అల్జీరియా దేశంలో దారుణం చోటుచేసుకుంది. అల్జీరియాలోని కబైలియా రీజియన్లోని కొన్ని ప్రాంతాల్లో సడెన్గా పలుదఫాలుగా మంటలు చెలరేగాయి. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో సైన్యం రంగంలోకి దిగి చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మంటల్లో ఇప్పటి వరకు 42 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇంతో 25 మంది సైనికులు, 17 మంది సాధారణ పౌరులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. పౌరులను రక్షించే క్రమంలో సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు…
ఇరాక్లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…ఇరాక్లోని నసీరియా పట్టణంలోని అల్ హుస్సేన్ అనే కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలింది. ఈ పెలుడు కారణంగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు కరోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ వార్డుకు వ్యాపించాయి. Read: పుకార్లకు చెక్ పెట్టిన తలైవి…
భూమిపై అగ్నిప్రమాదాలు జరుగుతుండటం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ, సముద్రం అడుగు భాగంలో అగ్నిప్రమాదాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. సముద్రంలో ఉండే అగ్నిపర్వతాలు బద్దలైనపుడు మాత్రమే అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ, మెక్సికోలోని యుకటాన్ పెనిన్సులా తీరానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అగ్నాకీలలు ఎగసిపడ్డాయి. అయితే అప్రమత్తమైన నావికా సిబ్బంది అరగంటపాటు రెస్క్యూ చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. సముద్రం అడుగుభాగంలో ఏర్పాటు చేసిన గ్యాస్పైప్లైన్ బ్లాస్ట్ కావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి…
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే షాహెన్బాగ్ ఫైఓవర్కు మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకొని క్షణాల్లో పెద్దవిగా మారాయి. వెంటనే స్పందించిన ప్రజలు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ, నోయిడా మార్గంలో ఈ ఫైఓవర్ ఉండటం, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు వాహనాలను దారిమళ్లించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై…
హెచ్పీసీఎల్ అగ్నిప్రమాదం పై విచారణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. నేడు ఆ నివేదికను కలెక్టర్ వినయ్ చంద్ కు అందజేసే అవకాశం ఉంది. సీడీయు-3లో పైప్ లైన్ దెబ్బ తినడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారణ చేసింది. పైప్ లైన్ బయటకు సరిగ్గానే కనిపించినా లోపల దెబ్బతినడాన్ని గుర్తించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది కమిటీ. పైప్ లైన్ బలాన్ని నిర్దారించే హైడ్రో టెస్ట్ ఎప్పుడు నిర్వహించారు, ప్రమాదం తీవ్రత పెరగకుండా ఎటువంటి చర్యలు…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సమయంలో.. ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. త్వరిత గతిన ఆక్సిజన్ తరలింపునకు ప్రత్యేక రైళ్లు, విమానాలు నడుపుతోంది ప్రభుత్వం.. అయితే, ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. శనివారం హైదరాబాద్ నుండి చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ కి వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ల గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.. అది గమనించిన సిబ్బంది.. పెద్దపల్లి జిల్లా సమీపంలోని 38వ గేటు వద్ద…
విశాఖ జిల్లాను వరస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. గతేడాది నుంచి విశాఖ జిల్లాలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు వణికిపోతున్నారు. ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన విశాఖ జిల్లాలో వరస ప్రమాదాలు జరుగుతుండటం ఆంధోళన కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా, అర్ధరాత్రి సింహాచలం ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్లోని ట్రాన్స్ ఫార్మర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో స్టానిక ప్రజలు భయాంధోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున మంటలు…
విశాఖపట్నం హెచ్పీసీఎల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు హోంమంత్రి సుచరిత. ప్రమాద సంఘటన గురించి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన హోం మినిస్టర్… సహాయకచర్యలు చేపట్టాలని ఫైర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హెచ్పీసీఎల్ లోని ఫైర్ ఐదు ఇంజెన్స్ తో పాటు మరో 7 అదనంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. హెచ్పీసీఎల్ లో పాత టెర్మినల్ లో ప్రమాదం జరిగినట్లు హోంమంత్రి కి వివరించారు అధికారులు. ప్రమాదం సంభవించిన వెంటనే సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్లు తెలిపారు.…
హైదరాబాద్లోని నారాయణగూడాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నారాయణగూడాలోని అవంతి నగర్లో ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో సడెన్ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఆగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ఇక, ఈ అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే మరేమైనా కారణాలు…