PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB Fines Pakistan Players: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు సెమిస్ కు చేరకుండానే వెనుతిరిగిన సంగతి తెలిసిందే.. టోర్నమెంట్ ముందు ఎన్నో కండిషన్స్ అంటూ నానా హంగామా చేసినా ఆ దేశ బోర్డు.. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఇది ఇలా ఉండగా.. జట్టు నిరాశాజనక ప్రదర్శన ఇప్పుడు ఆటగాళ్లకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఏర్పడింది. టోర్నమెంట్ నుండి వైదొలిగిన పాకిస్తాన్ జట్టు సభ్యులందరిపై భారీ జరిమానా విధిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం ప్రకటించింది.
T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
వరుసగా నాలుగో ఐసీసీ టోర్నమెంట్ లో కూడా పాక్ జట్టు సెమీఫైనల్ కు చేరుకోలేకపోవడంతో బోర్డు కఠిన చర్యలకు దిగింది. మీడియా నివేదికల ప్రకారం.. ప్రతి ఆటగాడిపై 50 లక్షల పాకిస్థాన్ రూపాయల (సుమారు 16 లక్షల భారత రూపాయలు) భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఈ జరిమానా టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఆటగాడికి వర్తించనుంది. ఈ మొత్తం ఆటగాళ్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు లేదా ఇతర చెల్లింపుల నుంచి కట్ చేయబడనుంది. పాకిస్తాన్ క్రికెట్ లో ఫలితాలపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాకపోయినా.. ఈసారి జరిమానా మొత్తం భారీగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
ఈ టోర్నమెంట్లో పాకిస్థాన్ తన అన్ని మ్యాచ్ లను శ్రీలంక వేదికలపై ఆడింది. ప్రారంభ మ్యాచ్ లో నెదర్లాండ్స్పై 3 వికెట్ల తేడాతో గెలిచినా ఆ విజయం కూడా కష్టపడి సాధించింది. అనంతరం USAపై 32 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. అయితే భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. అయినప్పటికీ సూపర్-8 దశకు చేరుకుంది. ఇక సూపర్-8లో మాత్రం ప్రదర్శన మరింత నిరాశగా కొనసాగింది. సూపర్-8లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం.. ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక చివరగా శ్రీలంకపై గెలిచినా నెట్ రన్ రేట్ కారణంగా సెమిస్ కు అర్హత సాధించలేకపోయింది.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?