నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది భారతీయ జనతా పార్టీ.. ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.. వైసీపీ కార్యకర్తల్లా వాలంటీర్లు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.. Read…
రాష్ట్రపతి ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ ప్రారంభం రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 చివరి తేదీ కాగా.. జూలై 18న ఓటింగ్, జూలై 21న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నిక ప్రక్రియ మొత్తం జూలై 24నాటికి పూర్తికానుంది. ఇదిలా ఉంటే.. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీకి పోటీగా ప్రతిపక్షాల తరఫున దీటైన ఉమ్మడి…
పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడి జాతీయ అసెంబ్లీని… రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ చేస్తోన్న ప్రయత్నాలు సాఫీగా సాగేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతుండగా.. వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లుగా వచ్చే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమేనని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ చెబుతోంది. ముఖ్యంగా న్యాయపరమైన, రాజ్యాంగ…
ఏపీలో మరోసారి ఎన్నికల సందడి కనిపించబోతోంది. ఈ మేరకు ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానాన్ని భర్తీ చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో తాజాగా ఎన్నికల షెడ్యూల్ జారీ చేసింది. మార్చి 24న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపింది ఈ ఉప ఎన్నికకు…
పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు సోనూసూద్పై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. మోగా నియోజకవర్గంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ సోదరి మాళవికా పోటీ చేస్తున్నారు. దీంతో పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో నటుడు సోనూసూద్పై ఈసీ ఆంక్షలు విధించింది. ఆయన సోదరి పోటీ చేస్తున్న మోగాలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా నిషేధించింది. సోనూసూద్ కారును కూడా స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎన్నికల అధికారులు సోనూసూద్ను ఇంటికి తరలించారు.…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. EC ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు. ఈ విషయంపై రాజా…
పంజాబ్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది… దీంతో.. రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు.. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, అమరీందర్సింగ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగారు.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను టార్గెట్ చేస్తే విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. పఠాన్ కోట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. పంజాబ్ ప్రజల కోసం పనిచేసే అవకాశం బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. ఒక్క ఐదేళ్లు ఛాన్స్ ఇచ్చి చూడండి..…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని అన్నిరంగాలు తిరిగి తెరుచుకోవడంతో ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, కరోనా కేసులు, బందోబస్తు తదితర విషయాలపై ఈరోజు మరోసారి రివ్యూ చేసింది. కరోనా కేసుల కారణంగా మొన్నటి వరకు పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదు. తాజా రివ్యూ అనంతరం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే, ర్యాలీలు, పాదయాత్రలకు జిల్లా అధికారుల పర్మీషన్ తప్పనిసరి చేసింది. అంతేకాదు,…
ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నా.. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.. అన్ని పార్టీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ప్రచారం, ర్యాలీలు, బహిరంగసభలు ఇలా ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం.. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో.. ఇవాళ మరోసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికపై సమీక్ష నిర్వహించింది. రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.. Read Also: ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం…
ఒక వైపు కరోనా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు నిర్వహించింది. ఐదు రాష్ట్రాలతో వరుస వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు వెలువరించింది. వివిధ పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలలపై ఆంక్షలు అమలుచేస్తోంది. రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగించే అంశం పై నేడు నిర్ణయం తీసుకోనుంది కేంద్ర…