Bharat Jodo Yatra: పిల్లలను వాడుతున్నారు.. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘ భారత్ జోడో యాత్ర’ విమర్శలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. యాత్రలో పిల్లలను రాజకీయ సాధనాలుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై చర్యలు తీసుకోవాలని.. విచారణ ప్రారంభించాలని అత్యున్నత బాలల హక్కుల సంఘం (ఎన్సీపీసీఆర్) ఎన్నికల సంఘాన్ని కోరింది. గాంధీ, జవహర్ బాల్ మంచ్లు రాజకీయ ఉద్దేశాలతోనే పిల్లలను వాడుకుంటున్నాయని.. పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారని.. దీనికి సంబంధించి ఫిర్యాదులు అందాయని.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపింది.
బాలలకు సంబంధించి అనేక అవాంతర చిత్రాలు, వీడియో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని.. ఇందులో పిల్లలను టార్గెట్ చేస్తున్నారని.. బాలల హక్కుల సంఘం వ్యాఖ్యానించింది. రాజకీయ అజెండాలో భాగంగానే భారత్ జోడో యాత్రను ‘బచ్చే జోడో’ యాత్రగా మారుస్తున్నారని ఎన్సీపీసీఆర్ విమర్శించింది. పెద్దలు మాత్రమే రాజకీయ కార్యక్రమాల్లో భాగం కావాలనే ఎన్నికల కమిషన్ నిబంధలను ఇది ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది.
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
Read Also: Errabelli Dayakar Rao: బీజేపీ వల్లే దేశం నాశనమవుతోంది
ప్రాథమికంగా బాలల హక్కుల ఉల్లంఘన జరిగినందున.. రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి పిల్లలను ఆసరాగా ఉపయోగించడం వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి ఇది వ్యతిరేకం అని.. సంఘటనపై సమగ్ర విచారణ జరిగి.. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగే ఈ యాత్ర ఐదు నెలల తర్వాత కాశ్మీర్ లో ముగుస్తుంది. 3570 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది.
తాజావార్తలు
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?