Bharat Jodo Yatra: పిల్లలను వాడుతున్నారు.. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘ భారత్ జోడో యాత్ర’ విమర్శలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. యాత్రలో పిల్లలను రాజకీయ సాధనాలుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై చర్యలు తీసుకోవాలని.. విచారణ ప్రారంభించాలని అత్యున్నత బాలల హక్కుల సంఘం (ఎన్సీపీసీఆర్) ఎన్నికల సంఘాన్ని కోరింది. గాంధీ, జవహర్ బాల్ మంచ్లు రాజకీయ ఉద్దేశాలతోనే పిల్లలను వాడుకుంటున్నాయని.. పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారని.. దీనికి సంబంధించి ఫిర్యాదులు అందాయని.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపింది.
బాలలకు సంబంధించి అనేక అవాంతర చిత్రాలు, వీడియో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని.. ఇందులో పిల్లలను టార్గెట్ చేస్తున్నారని.. బాలల హక్కుల సంఘం వ్యాఖ్యానించింది. రాజకీయ అజెండాలో భాగంగానే భారత్ జోడో యాత్రను ‘బచ్చే జోడో’ యాత్రగా మారుస్తున్నారని ఎన్సీపీసీఆర్ విమర్శించింది. పెద్దలు మాత్రమే రాజకీయ కార్యక్రమాల్లో భాగం కావాలనే ఎన్నికల కమిషన్ నిబంధలను ఇది ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది.
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
Read Also: Errabelli Dayakar Rao: బీజేపీ వల్లే దేశం నాశనమవుతోంది
ప్రాథమికంగా బాలల హక్కుల ఉల్లంఘన జరిగినందున.. రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి పిల్లలను ఆసరాగా ఉపయోగించడం వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి ఇది వ్యతిరేకం అని.. సంఘటనపై సమగ్ర విచారణ జరిగి.. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగే ఈ యాత్ర ఐదు నెలల తర్వాత కాశ్మీర్ లో ముగుస్తుంది. 3570 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: 2027 వరల్డ్కప్లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ
-
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికెనా?
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?