ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు కీలకమయిన విధులు నిర్వర్తిస్తూ వుంటారు. వందల కేజీల డ్రగ్స్, బంగారం, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూ వుంటాయి. కానీ కొందరు కస్టమ్స్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడి వద్ద లంచం డిమాండ్ చేసిన కస్టమ్స్ అధికారి ఉదంతం ఇది. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి విషయంలో దారుణంగా ప్రవర్తించాడా అధికారి. లంచం ఇవ్వటానికి నిరాకరించడంతో కక్షకట్టిన కస్టమ్స్ అధికారులు ప్రత్యేక రూమ్ లోకి తీసుకెళ్ళి…
నలుగురు ఎమ్మెల్యేలు.. 14 మంది ఇంఛార్జులు. వీరిలో కొందరు కనిపించరు.. మరికొందరు టచ్మీ నాట్గా ఉంటారు. గాలి తగ్గి సైకిల్ పంక్చరయ్యే పరిస్థితులు ఉన్నా పట్టించుకోవడం లేదట. అందరూ గాలి కోసం ఎదురు చూస్తున్నారే తప్ప.. సైకిల్కి గాలికొట్టే ప్రయత్నాలే లేవట. ఆ జిల్లా ఏంటో.. అక్కడ నాయకులు ఎందుకలా ఉన్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యేలు.. ఇంఛార్జులు టీడీపీని పట్టించుకోవడం లేదట..! తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జోరు తగ్గిందా? వరస ఓటములు తమ్ముళ్లను నిరుత్సాహ…
తూర్పు గోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. జిల్లాలో మూడు ఒమిక్రాన్ అనుమానిత కేసులు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. బంగ్లాదేశ్ వెళ్లొచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సింగపూర్ నుంచి వచ్చిన దంపతులకు ఒమిక్రాన్గా అనుమిస్తున్నారు.. అయినవల్లి (మం) సిరిపల్లిలో యువకుడిని, రావులపాలెం (మం) గోపాలపురంలో భార్య,భర్తలను ఐసొలేషన్లో ఉంచారు అధికారులు.. ఇప్పటి వరకూ ఎవరికీ ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ కాలేదు.. ముగ్గురు శ్యాంపిల్స్ హైదరాబాద్ పంపించాం.. ఫలితాలు హైదరాబాద్ జీనోమ్ ల్యాబ్ నుంచి మూడు…
సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా చేసిన అశ్లీల నృత్యాలను చూసీ చూడనట్టుగా వ్యవహరించిన ఎస్సైపై సస్సెన్షన్ వేటు పడింది. తూర్పుగోదావరి జిల్లా కరప ఎస్సై రమేష్ బాబుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కూరాడలో జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్బంగా అశ్లీల నృత్యాలు చేశారు. ఈ వ్యవహారం రచ్చరేపింది. ముందస్తు సమాచారం రాబట్టడంలో విఫలం కావడంతో ఎస్సై పై చర్యలు తీసుకున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కార్యక్రమ నిర్వాహకులపై క్రిమినల్…
అధికారం చేతిలో వుంటే అవినీతి ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుందంటారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ అవినీతి సమ్రాట్లుగా ఎదిగిపోతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు ఇంటిపై, కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగానే ఆస్తులు, నగదు లభించినట్టు తెలుస్తోంది.…
తూర్పుగోదావరి జిల్లాలో ఓ వైసీపీ నేత ఓ మహిళా ఉద్యోగి పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఛాంబర్ లోనే ఒక దళిత ఎంపీడీవో పై ఏకవచనంతో రెచ్చిపోయారు నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు వాసంశెట్టి తాతాజీ. ఎంపీడీవో నచ్చకపోతే పంపించేయండి అని అంటే సరిగ్గా చేయకపోతే చీరేస్తానని వైసీపీ నాయకుడు బెదిరించడం కలకలం రేపుతోంది. కె.జగన్నాధపురం గ్రామంలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు, స్థానిక జడ్పీటీసీ ప్రొటోకాల్…
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేయలేమని ఏపీ పెట్రోలియం ట్యాంక్ ఆపరేటర్స్ అసోషియన్ అధ్యక్షడు వై.వి ఈశ్వర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు 125 ట్రక్కుల ద్వారా 160 బంకులకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ టెండర్లు వేసిందన్నారు. ఈ టెండర్లలో పశ్చిమ, తూర్పు గోదావరి నుంచి ఒక్కరంటే ఒక్కరూ పాల్గొనలేదని ఆయన…
తూర్పుగోదావరి జిల్లాలో స్కార్పియో వాహనం బీభత్సం కలిగించింది. ఒకరు దుర్మరణం పాలయ్యారు. కత్తిపూడి నుండి పిఠాపురం వైపు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పింది. గొల్లప్రోలు టోల్ ప్లాజా నుండి ఆపకుండా గేట్ ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది CG1100 నెంబర్ గల స్కార్పియో వాహనం. దీంతో కారును వెంబడించారు గొల్లప్రోలు హైవే పోలీసులు. పిఠాపురంలో బైపాస్ రోడ్ విరవాడ జంక్షన్ వద్ద వేగంగా వచ్చి యాక్టివా బైక్ ను ఢీకొట్టింది స్కార్పియో వాహనం. బైక్…
వర్షాల ఎఫెక్ట్తో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి… నిన్న మొన్నటి వరకు కిలో టమాటా వందకు పైగా పలకగా… ఇప్పుడు వంకాయ వంతు వచ్చింది.. హోల్సెల్ మార్కెల్లోనే కిలో వంకాయ ధర రూ.100కు చేరింది.. ఇక, బహిరంగ మార్కెట్కు వచ్చేసరికి కిలో రూ.150 వరకు పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.. మొత్తంగా కూరగాయల్లో రారాజుగా పిలవబడే వంకాయల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడి అంత ర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది…
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎప్పటి నుంచో వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు ప్రజలు.. వజ్రాలు దొరికి కొందరు లక్షలు సంపాదిస్తే.. కొందరు కోటీశ్వరులు అయ్యారని చెబుతారు.. ఇక, చాలా మందికి నిరాశే మిగిలింది.. అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరప్రాంతంలో బంగారపు నగలు దొరుకుతున్నాయనే మాట.. స్థానికుల చెవినపడింది.. దీంతో.. గత రెండు రోజులుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం జల్లెడ పడుతున్నారు స్థానిక మత్స్యకారులు.. మహిళలు, చిన్నారులు సైతం తీరంలో బంగారం…