అధికారం చేతిలో వుంటే అవినీతి ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుందంటారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ అవినీతి సమ్రాట్లుగా ఎదిగిపోతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు.
ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు ఇంటిపై, కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగానే ఆస్తులు, నగదు లభించినట్టు తెలుస్తోంది. దాదాపు 1.4 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. రాజమండ్రి, కాకినాడ, విజయవాడ గుణదల, హైదరాబాద్ నిజాంపేట్ , మేడ్చల్, మల్కాజ్ గిరిలో ఆయనకు సంబంధించిన అక్రమ ఆస్తులు గుర్తించారు. నిందితుడు సబ్ రిజిస్ట్రార్ ను రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.