IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్తో సెమీఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!
- తుది అంకానికి చేరిన టీ20 వరల్డ్ కప్ 2026
- మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీ
- భారత జట్టులో కీలక మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India playing 11 vs England for T20 World Cup 2026 Semi Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరింది. బుధవారం (మార్చి 4) నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. రెండో సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ నాకౌట్ మ్యాచ్లో గెలిచి ఫైనల్ చేరాలని రెండు టీమ్స్ చూస్తున్నాయి. భారత్, ఇంగ్లాండ్ పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. సెమీఫైనల్కు భారత తుది జట్టులో ఓ కీలక మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ కోసం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుని.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్ అవసరమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కుల్దీప్ తన చైనామన్ బౌలింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. కీలక మ్యాచ్ల్లో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ బావిస్తోంది. వరుణ్ కూడా మిస్టరీ స్పిన్నర్గా గుర్తింపు పొందినప్పటికీ.. ఇటీవల మ్యాచ్ల్లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ మార్పుకు కారణమని సమాచారం.
Also Read
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
- New T20 captain Shreyas Iyer: 'సింహాల్లా ఆడదాం'.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
Also Read: Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!
ఫైనల్కు చేరాలంటే భారత్, ఇంగ్లాండ్ జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చిన్న మార్పు కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపవచ్చు. టీమిండియా చివరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కితే.. స్పిన్ విభాగంలో భారత్కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. అభిమానులు ఈ కీలక మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వెస్టిండీస్పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన సంజు శాంసన్ ఓపెనర్గా కొనసాగనున్నాడు. ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబేలు రన్స్ చేస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అభిషేక్ శర్మ ఒక్కడు రాణిస్తే తిరుగుండదు. బౌలింగ్లో బుమ్రా రాణిస్తున్నా.. మిగతా వారు రన్స్ కట్టడి చేస్తే భారత్ ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి.
భారత్ జట్టు (అంచనా):
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!