IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్తో సెమీఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!
- తుది అంకానికి చేరిన టీ20 వరల్డ్ కప్ 2026
- మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీ
- భారత జట్టులో కీలక మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India playing 11 vs England for T20 World Cup 2026 Semi Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరింది. బుధవారం (మార్చి 4) నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. రెండో సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ నాకౌట్ మ్యాచ్లో గెలిచి ఫైనల్ చేరాలని రెండు టీమ్స్ చూస్తున్నాయి. భారత్, ఇంగ్లాండ్ పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. సెమీఫైనల్కు భారత తుది జట్టులో ఓ కీలక మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ కోసం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుని.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్ అవసరమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కుల్దీప్ తన చైనామన్ బౌలింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. కీలక మ్యాచ్ల్లో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ బావిస్తోంది. వరుణ్ కూడా మిస్టరీ స్పిన్నర్గా గుర్తింపు పొందినప్పటికీ.. ఇటీవల మ్యాచ్ల్లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ మార్పుకు కారణమని సమాచారం.
Also Read
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
- Rahul Dravid: "హీరోలు లేకుండా క్రీడ ఉండదు".. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
- Shubman Gill: "మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు".. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
Also Read: Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!
ఫైనల్కు చేరాలంటే భారత్, ఇంగ్లాండ్ జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చిన్న మార్పు కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపవచ్చు. టీమిండియా చివరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కితే.. స్పిన్ విభాగంలో భారత్కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. అభిమానులు ఈ కీలక మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వెస్టిండీస్పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన సంజు శాంసన్ ఓపెనర్గా కొనసాగనున్నాడు. ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబేలు రన్స్ చేస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అభిషేక్ శర్మ ఒక్కడు రాణిస్తే తిరుగుండదు. బౌలింగ్లో బుమ్రా రాణిస్తున్నా.. మిగతా వారు రన్స్ కట్టడి చేస్తే భారత్ ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి.
భారత్ జట్టు (అంచనా):
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..