IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్తో సెమీఫైనల్.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!
- తుది అంకానికి చేరిన టీ20 వరల్డ్ కప్ 2026
- మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీ
- భారత జట్టులో కీలక మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India playing 11 vs England for T20 World Cup 2026 Semi Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరింది. బుధవారం (మార్చి 4) నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. రెండో సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ నాకౌట్ మ్యాచ్లో గెలిచి ఫైనల్ చేరాలని రెండు టీమ్స్ చూస్తున్నాయి. భారత్, ఇంగ్లాండ్ పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. సెమీఫైనల్కు భారత తుది జట్టులో ఓ కీలక మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ కోసం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుని.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్ అవసరమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కుల్దీప్ తన చైనామన్ బౌలింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. కీలక మ్యాచ్ల్లో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ బావిస్తోంది. వరుణ్ కూడా మిస్టరీ స్పిన్నర్గా గుర్తింపు పొందినప్పటికీ.. ఇటీవల మ్యాచ్ల్లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ మార్పుకు కారణమని సమాచారం.
Also Read
- VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు... వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
- Campbell Thomson: "ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
Also Read: Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!
ఫైనల్కు చేరాలంటే భారత్, ఇంగ్లాండ్ జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చిన్న మార్పు కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపవచ్చు. టీమిండియా చివరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కితే.. స్పిన్ విభాగంలో భారత్కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. అభిమానులు ఈ కీలక మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వెస్టిండీస్పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన సంజు శాంసన్ ఓపెనర్గా కొనసాగనున్నాడు. ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబేలు రన్స్ చేస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అభిషేక్ శర్మ ఒక్కడు రాణిస్తే తిరుగుండదు. బౌలింగ్లో బుమ్రా రాణిస్తున్నా.. మిగతా వారు రన్స్ కట్టడి చేస్తే భారత్ ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి.
భారత్ జట్టు (అంచనా):
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!