సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. అయితే కోడి పందాలు సంప్రదాయ బద్ధంగానే నిర్వహించాలని కోర్టులు తెలుపుతున్నా.. కోర్డుల ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో భారీగా తమ కోళ్లను బరిలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముమ్మిడివరం, రామచంద్రాపురం, కాకినాడ, రాజానగరం, ఐ.పోలవరం,…
సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతాయ్. ఇది కొందరికి సంప్రదాయం. మరికొందరికి పండుగ పూట వినోదం.. ఇంకొందరికి దండిగా ఆదాయం సమకూరే మార్గం. ఆనవాయితీ ముసుగులో ఇదే వేదికగా ఇతర జూదాలకు దిగుతున్నారు.ఏటా సంక్రాంతికి కోట్లలో చేతులు మారుతుండడం రివాజుగా మారుతోంది. అడ్డుకుంటామని పోలీసులు అంటుంటే..ఆడించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య రెండు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండగ సంక్రాంతి.…
వర్గ విభేదాలు ఆ నియోజకవర్గం టీడీపీలో చిచ్చు పెట్టాయా? కొత్తగా వచ్చే ఇంఛార్జ్పై సస్పెన్స్ కొనసాగుతోందా? ప్రస్తుత ఇంఛార్జ్ తగ్గేదే లేదని చెబుతున్నారా? ఇద్దరు మాజీ మంత్రుల ఎత్తుగడ మధ్య టీడీపీ రాజకీయం మలుపులు తిరుగుతోందా? మాజీ మంత్రుల్లో ఎవరి మాట నెగ్గుతుంది?తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ టీడీపీ కొత్త ఇంఛార్జ్ ఎవరు? ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం ఎందుకు సస్పెన్స్ కొనసాగిస్తోంది? ఆ నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లకు అర్థం కావడం లేదట. మాజీ ఎమ్మెల్యే పిల్లి…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్రాంతి పండగ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఓవైపు సర్కార్, పోలీసులు నిఘా పెడుతున్నా కోడి పందాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.. పని చేస్తున్న ప్రాంతాన్ని వదిలి.. సొంత ఊరికి పరుగులు పెడుతున్నారు.. దీని కోసం ప్రత్యేక రైళ్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఇక, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా పండగకు అవసరమైన సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉంటుంది సర్కార్.. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రేషన్…
సంక్రాంతికి ముందే కోనసీమలో రాజకీయ పందెంకోళ్లు సెగ పుట్టిస్తున్నాయా? రోడ్డు పనులపై రచ్చ రంబోలా అవుతోందా? వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు.. విమర్శలు.. అవినీతిలో కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తున్నాయా? రాజకీయంగా వేడెక్కిస్తున్న అంశాలేంటి? తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం-కొత్తపేట రోడ్డు నిర్మాణ పనులు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి. పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అనేక మలుపులు తిరిగి వైసీపీ, టీడీపీ మధ్య రచ్చ రచ్చ అవుతోంది. అధ్వాన్నంగా తయారైన ఈ రహదారికి మరమ్మతులు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీలు…
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే… ముమ్మిడివరం పంచాయతీకి చెందిన గ్రామ వాలంటీర్ లక్ష్మీకుమారి శనివారం నాడు అన్నంపల్లి వద్ద అకస్మాత్తుగా గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఈ సమాచారాన్ని వైసీపీ కౌన్సిలర్ విజయ్కు చేరవేశారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ విజయ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వాలంటీర్ను కాపాడేందుకు గోదావరిలో దూకారు. Read Also: భయం గుప్పిట్లో ప్రపంచం… సునామీలా దూసుకొస్తున్న…
ప్రపంచాన్ని ఒమిక్రాన్ కేసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత దేశంలోనూ కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. ఏపీలో బుధవారం ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. రావులపాలెం మండలం ఊబలంకలో మూడు ఒమిక్రాన్ కేసులతో అప్రమత్తం అయ్యారు అధికారులు. ఒమిక్రాన్ కేసులు నమోదైన ప్రాంతంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు పంచాయతీ సిబ్బంది. సౌదీ…
సముద్రం ఎంతో సంపదకు ఆలవాలం. ఎన్నోరకాల చేపలు వలకు చిక్కుతుంటాయి. అప్పుడు తిమింగలాలు కూడా పడతాయి. కానీ అరుదైన చేపలు మాత్రం అరుదుగా మత్స్యకారులకు దొరుకుతాయి. రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు మంచి చేపలు దొరికితే ఆనందంతో గంతులేస్తారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో మత్స్యకారుల పంట పండింది. అంతర్వేదిలో మినీ హార్బర్లో ఉప్పాడ మత్స్యకారులకు అదృష్టం వరించింది. వారు వేసిన వలకు చిక్కింది మామూలు ఆషామాషీ చేప కాదండోయ్. సుమారు…
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుండా ఆ గ్రామస్తులు నడుం బిగించారు. రోడ్డు వేసుకుని తమ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం అరవపాలెం గ్రామంలో స్వచ్ఛందంగా రోడ్లు వేసుకున్న గ్రామస్తులు. వీరికి జనసైనికులు తమవంతు సాయం చేశారు. అరవ పాలెం నుండి చింతలపల్లి రోడ్డు అధ్వానంగా మారడంతో సొంత ఖర్చులతో చందాలు వేసుకుని రోడ్లు చదును చేస్తుకున్నారు గ్రామస్తులు. గత కొన్నేళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించలేదు. దీంఓ తామే…
ఆ జిల్లాలో చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది ఓ పెద్ద మాఫియా. పురాతన బౌద్ధ మహాస్థూపం ఉన్న కొండపై మైనింగ్ గెద్దల కన్ను పడింది. కొండను తవ్వి గుల్ల చేయడానికి రంగం చేస్తోంది. సొంత జేబులు నింపుకోవడానికి చరిత్రను మాయం చేసేలా కుట్రలు బయటకొస్తున్నాయి. ఇంతకీ ఈ కుట్ర వెనక ఉన్నదెవరు? చారిత్రక కొండను తవ్వి మట్టి తరలించేలా మాఫియా ఎత్తుగడ..! ఇది తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని కొడవలి బౌద్ధ స్తూపాలు ఉన్న ధనంకొండ.…