తూర్పుగోదావరిలో ఒమిక్రాన్ కలకలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు గోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. జిల్లాలో మూడు ఒమిక్రాన్ అనుమానిత కేసులు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. బంగ్లాదేశ్ వెళ్లొచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సింగపూర్ నుంచి వచ్చిన దంపతులకు ఒమిక్రాన్గా అనుమిస్తున్నారు.. అయినవల్లి (మం) సిరిపల్లిలో యువకుడిని, రావులపాలెం (మం) గోపాలపురంలో భార్య,భర్తలను ఐసొలేషన్లో ఉంచారు అధికారులు.. ఇప్పటి వరకూ ఎవరికీ ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ కాలేదు.. ముగ్గురు శ్యాంపిల్స్ హైదరాబాద్ పంపించాం.. ఫలితాలు హైదరాబాద్ జీనోమ్ ల్యాబ్ నుంచి మూడు నుంచి ఐదు రోజుల్లో వస్తాయని వెల్లడించారు అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ బి. మీనాక్షి..
Read Also: ఒమిక్రాన్తో ఆందోళన వద్దు.. ఇలా చేయండి..!
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
మరోవైపు.. చైనా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా సహా 12 దేశాల నుంచి వచ్చిన వారిని ఒమిక్రాన్ హైరిస్క్ గా పరిగణిస్తున్నాం.. డిసెంబర్ 1వ తేదీ నుంచి జిల్లాకు 2,743 మంది వివిధ దేశాల నుంచి వచ్చారని తెలిపారు డాక్టర్ మీనాక్షి.. ఎయిర్పోర్ట్లో నెగిటివ్ వచ్చినా నిబంధనల ప్రకారం ఎనిమిదో రోజు మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్న ఆమె.. జిల్లాకు ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి ఎనిమిదో రోజు తర్వాత పాజిటివ్ రావటంతో ఒమిక్రాన్గా అనుమానం ఉందన్నారు.. ముగ్గురి శ్యాంపిల్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్ జీనోమ్ ల్యాబ్ కు పంపించామని.. త్వరలోనే అది తేలిపోతుందన్నారు. కాగా, ఇవాళ తెలంగాణలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.. ఏపీలోనూ గతంలో ఒక ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినా.. ఆయనకు పాజిటివ్గా రిపోర్టు వచ్చేసరికే.. కోలుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!