వర్గ విభేదాలతో టీడీపీలో చిచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్గ విభేదాలు ఆ నియోజకవర్గం టీడీపీలో చిచ్చు పెట్టాయా? కొత్తగా వచ్చే ఇంఛార్జ్పై సస్పెన్స్ కొనసాగుతోందా? ప్రస్తుత ఇంఛార్జ్ తగ్గేదే లేదని చెబుతున్నారా? ఇద్దరు మాజీ మంత్రుల ఎత్తుగడ మధ్య టీడీపీ రాజకీయం మలుపులు తిరుగుతోందా?
మాజీ మంత్రుల్లో ఎవరి మాట నెగ్గుతుంది?
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ టీడీపీ కొత్త ఇంఛార్జ్ ఎవరు? ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం ఎందుకు సస్పెన్స్ కొనసాగిస్తోంది? ఆ నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లకు అర్థం కావడం లేదట. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. ఆమెకు.. ఆమె భర్త సత్తిబాబుకు చెక్ పెట్టాలని మాజీ మంత్రి చినరాజప్ప వర్గం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వర్గంగా పిల్లి కుటుంబంపై ముద్ర ఉంది. దీంతో ఇక్కడ ఇద్దరు మాజీ మంత్రుల్లో ఎవరి మాట నెగ్గుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ ఆధిపత్య పోరు కారణంగానే కొత్త ఇంఛార్జ్ను తేల్చడం లేదనే అనుమానాలు ఉన్నాయట.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
చినరాజప్ప వర్గంపై పిల్లి కుటుంబం ఫైర్..!
గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని పిల్లి కుటుంబం వదిలేసిందనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. వైసీపీతో ఢీ అండే ఢీ అనే స్థాయిలో పోరాటాలు లేవన్నది టీడీపీలోని పిల్లి ప్రత్యర్థుల ఆరోపణ. పైగా తెర వెనక వైసీపీతో సత్సంబంధాలు ఉన్నాయని టీడీపీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయట. ఇదే సమయంలో సత్తిబాబు కుటుంబానికి చెందిన కొందరు తాము వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతిస్తామని చెప్పి ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటన్నింటిని గమనించిన చినరాజప్ప వర్గం స్పీడ్ పెంచింది. ఇంఛార్జ్ను మార్చాలనే డిమాండ్ చర్చకు పెట్టేశారు. అయితే తాము టీడీపీని వీడబోమని.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబులు తమ నేత యనమలకు స్పష్టం చేశారట.
పిల్లి కుటుంబంపై టీడీపీ పెద్దలకు ఫిర్యాదులు..!
ఆ మధ్య జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికలో 3వ డివిజన్ టీడీపీ అభ్యర్థి నామినేషన్ను చివరిక్షణంలో విత్డ్రా చేసుకోవడంతో సత్తిబాబుపై విమర్శలు వచ్చాయి. దీనిపై చినరాజప్ప వర్గం టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేసింది కూడా. కొత్త ఇంఛార్జ్ను నియమించకపోతే.. రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అడ్రస్సే లేకుండా పోతుందనే వాదన చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారట. ఇవన్నీ చూసిన పిల్లి వర్గం కూడా స్వరం సవరించుకుంది. సొంత సామాజికవర్గానికి ఇంఛార్జ్ పదవి ఇప్పించుకునేందుకే చినరాజప్ప తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతోంది. గతంలో కూడా ఇక్కడి టీడీపీలో వర్గపోరు నడిచినా.. పెద్దగా రోడ్డెక్కిన పరిస్థితులు లేవు.
ఇంఛార్జ్ పదవి ఆశిస్తున్నవాళ్లంతా అమరావతికి క్యూ..!
నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టడానికి ఇంఛార్జ్ మార్పునకే చంద్రబాబు మొగ్గు చూపొచ్చన్నది టీడీపీ వర్గాల మాట. ఎవరైతే ఇంఛార్జ్ పదవి ఆశిస్తున్నారో వారంతా టీడీపీ పెద్దల దగ్గరకు వెళ్లి చెప్పాల్సింది చెప్పి వస్తున్నారట. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య ఆధిపత్యపోరు కావడంతో సమస్యను చంద్రబాబు తేలిగ్గా పరిష్కరిస్తారా? లేక నాన్చివేత ధోరణిలో ఉంటారా అన్నది ప్రశ్న.
తాజావార్తలు
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
CM Vijay: IMDb లిస్ట్ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి ‘దళపతి’! అసలేం జరిగిందంటే..
-
Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
-
Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!