వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తన ముద్రవేయాలని అప్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగా పంజాబ్లో ఆప్ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ను అందిస్తామని ప్రకటించింది. చంఢీగ్ పర్యటనకు ఒకరోజు ముందుగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో పంజాప్ ఆప్ కేడర్ మరింత ఉత్సాహంగా మారింది. పంజాబ్ లో అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్యత్…
వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ఆ చిన్నారికి వచ్చింది. ఈ వ్యాధి ట్రీట్మెంట్ కు ఒక ఇంజెక్షన్అవసరం. భారత్లో దొరకని ఆ ఇంజెక్షన్ ను అమెరికా నుంచి తెప్పించాలంటే 16 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ, చిన్నారి తల్లిదండ్రులకు అంతటి స్తోమత లేదు. అనుకొని విధంగా అదృష్టం వరించింది… ఇంజెక్షన్ ఉచితంగా పొంది పాపకు ఇంజెక్షన్ వేయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ.. చిన్నపిల్లల్లో కనిపించే ఓ జన్యు…
ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఇక డీజిల్ కూడా సెంచరీకి సిద్దమవుతుంది. తాజా పెంపుతో సెంచరీదాటిన పెట్రోల్ రాష్ట్రాల్లో తమిళనాడు కూడా చేరిపోయింది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 36 పైసలు.. డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.32 కాగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.70 కు చేరింది. ఢిల్లీలో…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా కలవరపెడుతూనే ఉంది.. కేసులు తగ్గుతున్నా కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్.. బయటపడింది.. ఇప్పటికే భారత్లో ఆరు, ఏడు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూడగా.. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తొలి కేసు నమోదైంది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తిరుపతికి చెందిన బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్గా తేలింది.. పుణెలోని సీసీఎంబీలో నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ కమిటీల నియమాకంపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. రేపో, మాపో అంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఊరిస్తూనే ఉంది.. తాజా పరిణామాలు చూస్తుంటే.. లిస్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో కాంగ్రెస్ బాధ్యుల నియామకానికి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లి ముదిరాజ్ను నియమించింది అధిష్టానం.. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి…
తెలుగు తేజం, ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరికి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించింది ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని ఢిల్లీలో తొలిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్… ఆ వర్సిటీ తొలి వీసీగా కరణం మల్లేశ్వరికి అవకాశం దక్కింది.. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయాల్సింది.. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. 18 ఏళ్లు దిగువన ఉన్న చిన్నారులకు మాత్రం ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.. అయితే, ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ మాత్రం జరుగుతున్నాయి.. చిన్నారులకు వ్యాక్సిన్పై స్పందించిన ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి చిన్నారులకు కూడా కోవాగ్జిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు… రెండేళ్లు పైబడిన చిన్నారులకు ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అన్నారు.. ఇప్పటికే…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో బుగ్గనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ పాల్గొనగా… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించాం అన్నారు.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర ఆమోదం ప్రోగ్రెస్ లో…
ఢిల్లీ వేదికగా ఇవాళ ఎన్సీపీ అధినేత, రాజకీయ దిగ్గజం శరద్ పవార్తో ఎన్నికల వ్యూహకర్త ప్రకాశం కిషోర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది… ఇంతకుముందే ఈ ఇద్దరు చర్చలు జరపడం హాట్ టాపిక్ కాగా.. ఇవాళ మరోసారి సమావేశమయ్యారు.. ప్రాంతీయ పార్టీలతో ‘థర్డ్ ఫ్రంట్’పైనే సమాలోచనలు జరిగినట్టు ప్రచారం సాగుతోంది.. “జాతీయ కూటమి” ఏర్పాటుకు ఎలా ముందుకు సాగాలి అనే దానిపై ఫోకస్ పెట్టారు.. మొత్తానికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయినట్టు…
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మరో కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు కోర్ కమిటీ సమావేశం లేదు.. ఎలాంటి చర్చ లేదని… ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏంటని హనుమంతరావు పేర్కొన్నారు. కర్ణాటకలో పీసీసీ అంశం వివాదం అయితే పరిశీలకుడిగా మధుసూదన్ మిస్త్రీని పంపించారని… ఇక్కడ మాణిక్కం ఠాగూర్ తీసుకున్న నిర్ణయమే ఫైనలా…