ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి మొదట బౌలింగ్ను ఎంచుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఎట్టకేలకు క్రికెట్ స్టేడియంలో అడుగుపెట్టబోతున్నాడు. అయితే మ్యాచ్ ఆడటానికి కాదండోయ్.. చూడటానికి మాత్రమే.
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలుతా పంజాబ్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది.
అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. నేనింకా గేమ్ లోనే ఉన్నా.. ఐపీఎల్ ఆడడానికి త్వరలోనే మీ ముందుకు వస్తున్నా.. అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. దీంతో పంత్ మాటలు విన్న అభిమానులు ఆనందపడిపోయారు. కానీ అది ప్రమోషనల్ వీడియో అని తెలియగానే అందరు చల్లబడ్డారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున నాలుగైదు మ్యాచ్ లలో తను విఫలమయ్యాడు.. కానీ కేవలం పరుగులు సాధించని కారణంగా అతడిని తప్పిచడం తెలివితక్కువతనం అని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ అన్నాడు.