అయితే బ్రబౌర్న్ పిచ్ బ్యాటింగ్ క అనుకూలంగా ఉండనుంది. ముంబయి ఇండియన్స్ కు జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆసిసీ కెప్టెన్ మెగ్ లానింగ్ సారథిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగనుంది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. తుదిపోరులో ఢిల్లీతో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది.
ఐపీఎల్ లాగే తొలి మ్యాచ్ నుంచి అభిమానుల ఆసక్తి పెంచుతూ వచ్చిన WPL.. చివరి దశలో కూడా ఐపీఎల్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. WPL 2023 ఎలిమినేటర్ లో యూపీ వారియర్జ్ ను ఓడించిన ముంబయి ఇండియన్స్ ఫైనల్ చేరింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు WPL ఫైనల్ చేరుకుంది.
ముంబై బ్యాటర్లు జూలు విదిల్చారు. గత మూడు మ్యాచ్ లలో విఫలమైన బ్యాటర్లంతా నిన్న( శుక్రవారం ) జరిగిన మ్యాచ్ లో ధాటిగా ఆడారు. ఓపెనర్లు యాస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ లు శుభారంభం అందించగా.. వన్ డౌన్ లో వచ్చిన నటాలీ సీవర్(38 బంతుల్లో 72 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (19 బంతుల్లో 25, 5 ఫోర్లు )లు చిత్తకొట్టారు. వీరి దూకుడుతో నిర్ణత 20 ఓవర్లలో…
ఐపీఎల్ - 16వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త సారథిని ప్రకటించింది. కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయంతో ఈ సీజన్కు దూరమైన కారణంగా కొత్త సారథిని నియమించింది.
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఓడిన తర్వాత అద్బుత విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. బౌలర్లు అదరగొట్టడంతో గుజరాత్ జెయింట్స్ ని 105 పరుగులకి కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈటార్గెట్ ని 7.1 ఓవర్లలోనే ఊది పక్కన పడేసింది. యంగ్ సెన్సేషనల్ షెఫాలి వర్మ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేసి బౌండరీల వర్షం కురిపించింది.