Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- సింధు జలాల కోసం భారత్పై ఒత్తిడి తీసుకురావాలి..
- కెనడాను కోరిన పాకిస్తాన్, స్పందన కరువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) పునరుద్ధరణ కోసం భారత్పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాను పాకిస్తాన్ కోరింది. అయితే, దీనిపై పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సమయంలో, ఆమె ముందు పాకిస్తాన్ తన కోరికను వెల్లడించింది. ఇస్లామాబాద్లో జరిగి సంయుక్త సమావేశంలో పాక్ చేసిన విజ్ఞప్తిపై కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ అసలు స్పందించలేదు.
పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ, సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు భారత్పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాతో పాటు మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. నీటిని ఆయుధంగా వాడటాన్ని వ్యతిరేకించాలని ఆయన కోరారు. అయితే, భేటీ అనంతరం కెనడా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సింధు జలాల ఒప్పందం, పాకిస్తాన్ విజ్ఞప్తిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై మాత్రమే కెనడా తన ప్రకటనను పరిమితం చేసింది.
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
సాయం కోరుతున్న పాక్:
2025 ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్లో భయం మొదలైంది. సింధు జలాల ఒప్పందంపై మిత్ర దేశాల సాయాన్ని కోరుతోంది. భారత్పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తోంది. ఉగ్రవాదం ఆపేవరకు నీరు ఇవ్వమనే గట్టి నిర్ణయంపై భారత్ ఉంది.
1960లో ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మూడు తూర్పు నదులపై భారత్కు, మూడు పశ్చిమ నదులపై పాకిస్తాన్కు హక్కులు కల్పించారు. వివాదాల పరిష్కారం కోసం శాశ్వత సింధు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపేసే అధికారం లేదని పాకిస్తాన్ వాదిస్తోంది. ఉగ్రవాదం ఆపే వరకు నీరు ఇచ్చేది లేదని భారత్ తెగేసి చెబుతోంది.
తాజావార్తలు
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!