Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- సింధు జలాల కోసం భారత్పై ఒత్తిడి తీసుకురావాలి..
- కెనడాను కోరిన పాకిస్తాన్, స్పందన కరువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) పునరుద్ధరణ కోసం భారత్పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాను పాకిస్తాన్ కోరింది. అయితే, దీనిపై పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సమయంలో, ఆమె ముందు పాకిస్తాన్ తన కోరికను వెల్లడించింది. ఇస్లామాబాద్లో జరిగి సంయుక్త సమావేశంలో పాక్ చేసిన విజ్ఞప్తిపై కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ అసలు స్పందించలేదు.
పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ, సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు భారత్పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాతో పాటు మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. నీటిని ఆయుధంగా వాడటాన్ని వ్యతిరేకించాలని ఆయన కోరారు. అయితే, భేటీ అనంతరం కెనడా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సింధు జలాల ఒప్పందం, పాకిస్తాన్ విజ్ఞప్తిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై మాత్రమే కెనడా తన ప్రకటనను పరిమితం చేసింది.
Also Read
- Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
సాయం కోరుతున్న పాక్:
2025 ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్లో భయం మొదలైంది. సింధు జలాల ఒప్పందంపై మిత్ర దేశాల సాయాన్ని కోరుతోంది. భారత్పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తోంది. ఉగ్రవాదం ఆపేవరకు నీరు ఇవ్వమనే గట్టి నిర్ణయంపై భారత్ ఉంది.
1960లో ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మూడు తూర్పు నదులపై భారత్కు, మూడు పశ్చిమ నదులపై పాకిస్తాన్కు హక్కులు కల్పించారు. వివాదాల పరిష్కారం కోసం శాశ్వత సింధు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపేసే అధికారం లేదని పాకిస్తాన్ వాదిస్తోంది. ఉగ్రవాదం ఆపే వరకు నీరు ఇచ్చేది లేదని భారత్ తెగేసి చెబుతోంది.
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్ఫ్లిక్స్లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!