Crime News: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాగేష్ ను కర్రతో కొట్టి చంపేశాడు అతడి స్నేహితుడు నర్సింగ్.
నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు.. 29 లక్షలు దోపిడి.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. హాలీవుడ్ సినిమా తరహాలో దోపిడీ జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతం రావిరాలలో మరొకసారి ఏటీఎం దోపిడీ చోటుచేసుకుంది. నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు 29 లక్షల రూపాయల డబ్బును ఎత్తుకొని పోయారు.
Kavya Kalyani: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయమైన ఢీ షో డాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్ అనేకమంది యువతకు పేరు తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లు ప్రేక్షకాదరణ పొందారు. అయితే, తాజాగా ఢీ షో కు చెందిన ఓ డాన్సర్ పేరు మళ్ళీ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి విషాదకరమైన ఘటనకు సంబంధించింది వార్తల్లో నిలిచింది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో కావ్యకళ్యాణి (24) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి కారణం…
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ టూ వీలర్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టూ వీలర్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Sumanth Reddy: వరంగల్లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20వ తేదీన బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఒక…
Wife Harassment: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మానవ్ ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో మానవ్ కన్నీళ్లతో మాట్లాడుతూ.. తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె నడవడికపై తనకు అనుమానం వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె తనతో…
Pune Rape Case: పూణే అత్యాచార ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పూణే నగరం నడిబొడ్డున, పోలీస్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్స్టాండ్లో నిలిచి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రామ్దాస్ గాడే అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన విమర్శలు గుప్పిస్తోంది.
Shocking: పూణేలో దారుణం చోటు చేసుకుంది. రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో, పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం జరగడం సంచలనంగా మారింది. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్గా గుర్తించారు. పోలీస్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో, నిలిచిన ఉన్న బస్సులో మంగళవారం 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు 8 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. స్నిఫర్ డాగ్స్ని రంగంలోకి దించారు. నిందితుడు 36 ఏళ్ల రాందాస్కి…
వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు హత మార్చారు. అర్ధరాత్రి సమయంలో వినోద అనే వృద్ధురాలిని చంపేసి.. ఆమె ఇంట్లోనే ఉన్న బావిలో పడేశారు.