Madhya Pradesh: ఎంపీలో వ్యక్తి కిడ్నాప్, హత్య.. రక్షించేందుకు వెళ్లిన పోలీస్ కూడా మృతి..
- మధ్యప్రదేశ్లో దారుణం..
- వ్యక్తి కిడ్నాప్, హత్య..
- రక్షించడానికి వెళ్లిన ఏఎస్ఐ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో గిరిజనుల మూక ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, హత్య చేసింది. ఈ సంఘటనలో వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ఏఎస్ఐ కూడా మరణించాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. హింసకు సంబంధించి ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఐ మరణించగా, ఇతర పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని రేవా డీఐజీ సాకేత్ పాండే తెలిపారు.
Read Also: Pakistan: పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
కొన్ని నెలల క్రితం అశోక్ కుమార్ అనే గిరిజనుడిని చంపాడనే అనుమానంతో కోల్ గిరిజన మూక సన్నీ ద్వివేది అనే వ్యక్తిని అపహరించింది. అయితే, అశోక్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. కిడ్నాప్ తర్వాత, ద్వివేదిని రక్షించడానికి షాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి సందీప్ భారతీయ నేతృత్వంలో ఒక టీమ్ గాద్రా గ్రామానికి చేరుకుంది. వారు చేరుకునే సమయానికే, అతడిని ఒక గదిలో బంధించి, తీవ్రంగా కొట్టి చంపేశారు.
పోలీసులు గది తలుపు తెరిచినప్పుడు గిరిజనులు కర్రలు, రాళ్లతో వారిపై కూడా దాడి చేశారు. గాయపడిన అధికారులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఏఎస్ఐ చికిత్స పొందుతూ మరణించారు. జన సమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. మరింత హింస చెలరేగకుండా ఈ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!