బాత్ రూమ్ లో ఓ మహిళ స్నానం చేస్తోంది. కొద్దిసేపు జలకాలాడిన ఆమె కన్ను షవర్ పై పడింది. షవర్ కింద ఒక నల్లటి వస్తువు కనిపించింది. వెంటనే ఏంటా అని దాన్ని పట్టుకొని చూడగానే ఆమె వెన్నులో వణుకుపుట్టింది. అదొక చిన్న సీక్రెట్ కెమెరా అని తెలియగానే స్నానం చేయకుండానే నిలువునా తడిసిపోయింది. గత కొన్ని రోజుల క్రితం షవర్ పడడంతో ఒక పంబ్లర్ ని పిలిచిన ఘటన గుర్తుకు రావడంతో వెంటనే ఆమె పోలీసులను…
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య కొడుకుపై కక్ష పెంచుకున్న రెండో భర్త అతడిని అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన అరుణ అనే మహిళ భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. గద్వాల్ లోని ఓ కంపనీలో పని చేస్తూ ఆమె పిల్లలను చదివిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే అదే కంపెనీలో పనిచేసే వినయ్ తో…
సమాజంలో ఇంకా ఆడవారిపై వివక్ష ఉందని కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఆడ, మగ సమానమేనని ప్రపంచం మొత్తం కోడై కూస్తుంటే.. ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్లలు పుట్టారని వారిని చంపేస్తున్నారు.. ఆడపిల్లలను ఎందుకు కన్నవాని భార్యలను వేధిస్తున్నారు. తాజాగా ముగ్గురు ఆడపిల్లలే పుట్టారనే కోపంతో పుట్టిన పసిబిడ్డను నేలకేసి కొట్టి హతమార్చాడు. ఈ క్రూరమైన ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాపూరావు అనే వ్యక్తికి మహారాష్ట్రకి చెందిన మహిళతో…
వివాహేతర సంబంధాలకు వావి వరుసలు ఉండవు.. చిన్నా, పెద్ద తేడా ఉండదు. కామంతో కళ్లు మూసుకుపోయినవారికి అస్సలు విచక్షణే ఉండదు. తాజగా ఒక 35 ఏళ్ల మహిళ.. ఓ 14 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకొంది. ఆ విషయం ఇంట్లో తెలిసేసరికి ఇద్దరు కలిసి ఇంట్లోంచి పారిపోయిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని కూడవాసల్ తాలూకాలో బాలగురు, రసతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 13 ఏళ్ల కూతురు, 14…
చెన్నై ఎయిర్ పోర్ట్ కార్గోలో 400 సంవత్సరాల పురాతన నృత్య గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుండి కోయంబత్తూర్ వెళుతున్న ఓ పార్శిల్ లో ఈ గణపతి విగ్రహాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా పురాతన విగ్రహాన్ని చెన్నై వయా కోయంబత్తూర్ మీదుగా విదేశాలకు తరలిస్తుండగా అధికారులు వారి పథకాన్ని భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నై ఎయిర్పోర్ట్ లోని కార్గో పై ప్రత్యేక దృష్టి సారించినట్లు…
సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది.. కొంతమందికి గేమ్స్ అంటే ఇష్టం.. మరికొంతమందికి సినిమాలంటే పిచ్చి.. ఇంకొంతమందికి సంగీతం అంటే ఇష్టం.. వీటి వలన ఎన్ని అనర్దాలు వచ్చినా వారు మాత్రం వారికి అలవాటైన పనిని మాత్రం మానరు. ఎవరు చెప్పినా వినరు. తాజాగా ఒక భర్త నిత్యం పోర్న్ వీడియోలు చూస్తూ భార్యను వేధిస్తున్నాడు. ఆ అలవాటు మానుకోమని చెప్పినందుకు భార్యను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. దీంతో భార్య, భర్త వేధింపులు తట్టుకోలేక కోర్టు…
తనకు సంబంధంలేని కేసులో నన్ను వేధిస్తున్నారని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన లాలాగూడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాలపేటలో నివాసం ఉంటున్న రాజేష్ అనే వ్యక్తి గత నెల 27న ఒకరిపై దాడి చేశాడని లాలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సదరు రాజేష్ను పలుమార్లు పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ జరిపారు. గొడవకు నాకు సంబంధం లేకున్నా నాపై అక్రమంగా కేసు…
వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య అనుమానాలు సాధారణం. భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని, భార్య వేరొకరితో మాట్లాడుతుందని.. డబ్బులు ఇంట్లో ఇవ్వనుకుండా భర్త ఏం చేస్తున్నాడని .. ఇలాంటి అనుమానాలు ఉండడం సాధారణం. కానీ, భర్త ఒక హత్య చేసాడని, వాళ్ల కుటుంబమే హంతకుల ఫ్యామిలీ అని అనుమానించిన భార్య.. అతడిని ఎత్తిపొడుస్తూ అవమానించడంతో ఆ భర్త తట్టుకోలేకేపోయాడు.. ఆగ్రహంతో భార్యను సుత్తితో తలపై బాది హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తామిద్దరం లేకపోతే పిల్లలు అనాధలవుతారని వారిని…
ఫేస్ బుక్ పరిచయాలు, ఆన్ లైన్ స్నేహాలు నమ్మవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ముక్కు, మొహం తెలియనివారికి గుడ్డిగా నమ్మి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువతి తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన ఒక యువకుడిని నమ్మి, తన బాధలను చెప్పుకొంది. వాటిని అలుసుగా తీసుకునేం యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానని రూమ్ కి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.…
భార్యభర్తల మధ్య నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే వారి వైవాహిక జీవితం నూరేళ్లు సాగుతుంది. కానీ, ఇటీవల భార్యాభర్తల మధ్య నమ్మకం కన్నా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. భార్య తనను కాదని వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఒక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై ఉన్న అనుమానం పెనుభూతంగా మారడంతో కన్నకూతురినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చెన్నై ప్రాంతానికి చేసిన రాధా కృష్ణన్ అనే వ్యక్తి…