Human Trafficking : వరంగల్లో కిలేడీ గ్యాంగ్ అరాచకాలు.. భయాందోళనలో తల్లిదండ్రులు
- వరంగల్లో కిలేడీ గ్యాంగ్ హడావిడి.. అమాయక బాలికలు లక్ష్యం
- డ్రగ్స్ ముఠా ఆకృత్యాలు.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
- తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి గ్యాంగ్లు ఉన్నాయా? తల్లిదండ్రుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human Trafficking : వరంగల్లో ఓ మహిళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కిలేడీ గ్యాంగ్ అమాయక బాలికలను టార్గెట్ చేస్తూ పాశవిక దుశ్చర్యలకు పాల్పడుతోంది. మత్తుమందులకు బానిసై, ఈజీ మనీ కోసం బలహీన స్థితిలో ఉన్న బాలికలను లొంగదీసే ఈ ముఠా ఘోరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్కు బానిసైన ఆమె తనతో పాటు మరికొంత మందితో కలిసి గ్యాంగ్ ఏర్పరచుకుంది. కార్పొరేట్ పాఠశాలలు, సంపన్నుల కాలనీల వద్ద రెక్కీ నిర్వహిస్తూ, అమాయక బాలికలను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయం పెంచుకునేది. ఆపై, నమ్మకం కలిగించిన అనంతరం బయటకు వెళ్దామని చెప్పి కిడ్నాప్ చేసేది.
Also Read
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
బాలికలను అపహరించిన తర్వాత మత్తుమందులు ఇచ్చి, ముఠాతో టచ్లో ఉన్న మానవ మృగాలకు అప్పగించేది. డ్రగ్స్ మత్తులో ఉన్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి, అనంతరం తిరిగి ఆమె వద్దకు అప్పగించేవారు. ఇలా తాను కిడ్నాప్ చేసిన బాలికలను వివిధ ప్రాంతాలకు తరలించి అకృత్యాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవల మిల్స్ కాలనీలో ఓ బాలిక కిడ్నాప్ కావడంతో, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రెండ్రోజుల తర్వాత బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది. పోలీసుల విచారణలో, ఒక మహిళ పరిచయం పెంచుకుని బయటకు తీసుకెళ్లిందని, మత్తుమందు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదని బాలిక చెప్పింది. వైద్య పరీక్షల్లో ఆమెకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటన తల్లిదండ్రుల్లో తీవ్ర భయాన్ని రేపింది. ఒంటరిగా పిల్లలను పాఠశాలకు పంపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ మాత్రమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి గ్యాంగ్లు మరెక్కడైనా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి నేరస్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Bharat Ane Nenu: మహేష్ బాబు ఫ్యాన్స్తోనే కామెడీనా?.. ఫైట్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో!
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!