Human Trafficking : వరంగల్లో కిలేడీ గ్యాంగ్ అరాచకాలు.. భయాందోళనలో తల్లిదండ్రులు
- వరంగల్లో కిలేడీ గ్యాంగ్ హడావిడి.. అమాయక బాలికలు లక్ష్యం
- డ్రగ్స్ ముఠా ఆకృత్యాలు.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
- తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి గ్యాంగ్లు ఉన్నాయా? తల్లిదండ్రుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human Trafficking : వరంగల్లో ఓ మహిళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కిలేడీ గ్యాంగ్ అమాయక బాలికలను టార్గెట్ చేస్తూ పాశవిక దుశ్చర్యలకు పాల్పడుతోంది. మత్తుమందులకు బానిసై, ఈజీ మనీ కోసం బలహీన స్థితిలో ఉన్న బాలికలను లొంగదీసే ఈ ముఠా ఘోరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్కు బానిసైన ఆమె తనతో పాటు మరికొంత మందితో కలిసి గ్యాంగ్ ఏర్పరచుకుంది. కార్పొరేట్ పాఠశాలలు, సంపన్నుల కాలనీల వద్ద రెక్కీ నిర్వహిస్తూ, అమాయక బాలికలను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయం పెంచుకునేది. ఆపై, నమ్మకం కలిగించిన అనంతరం బయటకు వెళ్దామని చెప్పి కిడ్నాప్ చేసేది.
Also Read
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
బాలికలను అపహరించిన తర్వాత మత్తుమందులు ఇచ్చి, ముఠాతో టచ్లో ఉన్న మానవ మృగాలకు అప్పగించేది. డ్రగ్స్ మత్తులో ఉన్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి, అనంతరం తిరిగి ఆమె వద్దకు అప్పగించేవారు. ఇలా తాను కిడ్నాప్ చేసిన బాలికలను వివిధ ప్రాంతాలకు తరలించి అకృత్యాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవల మిల్స్ కాలనీలో ఓ బాలిక కిడ్నాప్ కావడంతో, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రెండ్రోజుల తర్వాత బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది. పోలీసుల విచారణలో, ఒక మహిళ పరిచయం పెంచుకుని బయటకు తీసుకెళ్లిందని, మత్తుమందు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదని బాలిక చెప్పింది. వైద్య పరీక్షల్లో ఆమెకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటన తల్లిదండ్రుల్లో తీవ్ర భయాన్ని రేపింది. ఒంటరిగా పిల్లలను పాఠశాలకు పంపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ మాత్రమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి గ్యాంగ్లు మరెక్కడైనా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి నేరస్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Bharat Ane Nenu: మహేష్ బాబు ఫ్యాన్స్తోనే కామెడీనా?.. ఫైట్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో!
తాజావార్తలు
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!