Crime News: అంబేద్కర్ కోనసీమలో దారుణం.. కన్న పిల్లలను కాలువలోకి తోసేసిన తండ్రి!
- అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో దారుణం
- కన్న పిల్లలను కాలువలోకి తోసేసిన తండ్రి
- ప్రాణాలు కోల్పోయిన ఏడేళ్ల కారుణ్య
- పిల్లి రాజు కోసం పోలీసుల గాలింపు చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేసి తండ్రి అదృశ్యమైన ఘటనతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రి పిల్లి రాజు గ్రామంలో రెండు కోట్ల రూపాయలు మేరకు అప్పులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక అదృశ్యం అయ్యాడు. పిల్లలు సందీప్, కారుణ్యలను రామచంద్రపురం మండలం తొగరువారి సావరం కాలువలో తోసివేసి.. ఆపై అదృశ్యమయ్యాడు. బాలుడు ఎలాగోలా ఒడ్డుకు చేరినా.. ఏడేళ్ల కారుణ్య ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని చూసి తల్లి విజయ శోకంలో మునిగిపోయారు. ఆర్థిక సమస్యలుంటే పరిష్కార మార్గాలు ఉంటాయని.. ఇలా చిన్నారులను తండ్రే ప్రాణాలు తీయాలనుకోవడం పట్ల వెంటూరు గ్రామంలో ఆవేదన వ్యక్తమవుతోంది.
చెల్లెలు, తనను స్కూలు నుండి తీసుకుని వెళ్లి చనిపోదామని తండ్రి రాజు చెప్పాడని అంటున్నాడు ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన కుమారుడు సందీప్. మొదట తనను, తర్వాత చెల్లిని కాలువలోకి తోసివేశాడని చెబుతున్నాడు. తాను కాలువలో ఊస పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డానని, చెల్లి కాలువలో మునిగిపోయి చనిపోయిందని చెప్పాడు. ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో విషయం చెప్పినట్లు సందీప్ తెలిపాడు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
గ్రామస్తుల నుండి రెండు కోట్ల రూపాయలకు అప్పులు చేసి.. తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో పిల్లి రాజు అదృశ్యం అయ్యాడని గ్రామస్తులు వాపోతున్నారు. కుమార్తెను చంపివేయటం దారుణమని ఆవేదన చెందుతున్నారు. కూలి నాళీ చేసుకుంటూ కష్టపడిన సొమ్ములు దాచుకుంటే.. ఫైనాన్స్ వ్యాపారి రాజు ఈ విధంగా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో అదృశ్యమైన ఫైనాన్స్ వ్యాపారి పిల్లి రాజు ఏమైపోయాడనేది మిస్టరీగా మారింది. గ్రామస్తులు నుండి అప్పులు తీసుకున్న రెండు కోట్ల రూపాయలు రాజు ఏం చేశాడు?, రాజు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడనే ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన పిల్లి రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..